పులి భామతో పూరి తమ్ముడు జతకడుతున్నాడు

దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు వస్తున్నాడు. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చిన సాయిరాం శంకర్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. 2014లో దిల్లున్నోడు, రోమియో సినిమాలతో వచ్చినా అవి కూడా బోల్తా కొట్టడంతో మరోసారి తన ప్రతిభను చూపించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చొరవ చూపించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులి సినిమాలో జత కట్టిన నిఖిషా పటేల్ ని కథానాయికగా పెట్టనున్నట్టు సమాచారం.

పులి సినిమా అపజయపాలైనా అమ్మడి అందానికి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు అమ్మడిని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఓం త్రిడి సినిమాలో కూడా మెరుపులు మెరిపించినా లాభం లేకుండా పోయింది. అయితే ఇక్కడ విజయం పొందకపోయినా కన్నడ సినిమాల్లో మాత్రం మంచి సక్సెస్ సాధిస్తూ సూపర్ క్రేజ్ సంపాధించింది నిఖిషా పటేల్. అయితే ఆ క్రేజ్ దృష్టిలో ఉంచుకునే సాయిరాం శంకర్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడట.

స్పైసీ లుక్స్ తో హీటు పుట్టించే నిఖిశా శాండిల్ వుడ్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇప్పుడు అదే ఫార్ములాను తెలుగులో కూడా ప్రయత్నించేందుకు రెడీ అవుతుంది. అందుకే వచ్చిన సాయిరాం శంకర్ సినిమాలో ఆఫర్ సద్వినియోగ పరచుకునేందుకు రెచ్చిపోయేందుకు సిద్ధమైందట అమ్మడు. మరి హిట్ కోసం తపిస్తున్న సాయిరాం శంకర్ కి నిఖిషా సహకారంతోనైనా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close