డిడిసిఏలో సెక్స్ రాకెట్ కూడా నడుస్తోంది: కేజ్రీవాల్

డిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ)లో జరిగిన ఆర్ధిక అవకతవకల గురించి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. కేజ్రీవాల్ ఈరోజు మరో సరికొత్త ఆరోపణ చేసారు. “ఒక జర్నలిస్టు తన కొడుకుని క్రికెట్ టీంలో చేర్చుకోమని డిడిసిఏలో ఒక సభ్యుడిని అడిగినప్పుడు, అందుకోసం జర్నలిస్టు భార్యను తనతో పడుకొనేందుకు పంపమని ఆ సభ్యుడు అడిగాడుట! ఈ విషయం ఆ జర్నలిస్టు నాతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు,” అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ “డిడిసిఏలో ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయో తెలియజేసేందుకు నేను ఈ విషయం బయటపెట్టవలసి వచ్చింది. మోడీ ప్రభుత్వం నా కార్యాలయంలో శోదాలు జరపడానికి సిబీఐ అధికారులను పంపిస్తుంది. కానీ నేను సిబీఐ విచారణలకు, కోర్టు కేసులకు భయపడే వ్యక్తిని కాను. ఎందుకంటే నేను ఎటువంటి అవినీతికి పాల్పడటం లేదు. నా ప్రభుత్వంలో మంత్రులు కూడా ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. డిడిసిఏలో ఇంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నేను ఇంతగా చెపుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదు. పైగా ఆయనే స్వయంగా అరుణ్ జైట్లీని వెనకేసుకు వస్తున్నారు. ఆయనను కాపాడేందుకే డిడిసిఏ అక్రమాలపై సిబీఐ చేత విచారణ చేయించవలసిన అవసరం లేదని ప్రధాని భావిస్తున్నట్లున్నారు,” అని అన్నారు.

“అరుణ్ జైట్లీ తను నిర్దోషినని భావిస్తున్నప్పుడు, డిడిసిఏలో జరిగిన అక్రమాల గురించి ఎవరయినా మాట్లాడితే అది తనకు చాలా అవమానకరంగా ఉందని ఎందుకు భావిస్తున్నారు? మా ప్రభుత్వంపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకపోయినా సిబీఐ అధికారులు దాడులు చేస్తారు. కానీ అనేక ఏళ్లుగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం కుంభకోణం జరుగుతున్నా పట్టించుకోరు,” అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close