ఛత్తీస్‌గడ్ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ఆడియోటేప్‌ల వివాదం

హైదరాబాద్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ఇవాళ బయటపెట్టిన ఆడియో టేప్‌ల కథనం ఛత్తీస్‌గడ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. 2014లో అంతాగడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందని చెబుతూ దానికి సంబంధించి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అల్లుడు పునీత్ గుప్తాకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి, కాంగ్రెస్ అభ్యర్థి మంతూరామ్ పవార్‌లకు మధ్య జరిగినట్లుగా చెబుతున్న టెలిఫోన్ సంభాషణల ఆడియో టేపులను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక బయటపెట్టింది.

గత ఏడాది జరిగిన ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంతూరామ్ పవార్ ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వైదొలగటంతో బీజేపీ అభ్యర్థి భోజ్ రాజ్ నాగ్ సునాయాసంగా గెలిచారు. ఇదిలా ఉంటే ఎన్నికల బరిలోనుంచి అభ్యర్థి వైదొలగటానికి డబ్బు ఇవ్వజూపినట్లు ఆరోపణ వచ్చినందున ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి షోకాజ్ నోటీస్ కూడా జారీచేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, బీజేపీకి సంబంధం లేదని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close