ఆఫ్ఘానిస్తాన్ లో భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై నలుగురు ఉగ్రవాదులు ఆదివారం రాత్రి దాడి చేసారు. కౌన్సిలేట్ భవనానికి సమీపంలో ఉన్న మరో భవనంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. కానీ భద్రతాదళాలు అప్రమత్తంగా ఉన్నందున వారి దాడిని తిప్పికొట్టాయి. భారత దౌత్యాధికారులందరినీ కౌన్సిలేట్ భవనం లోపలే ఉన్న ఒక సురక్షితమయిన ప్రదేశానికి తరలించారు. అందరూ క్షేమంగా ఉన్నారని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు.

భారత కాలమాన ప్రకారం రాత్రి 10-10.30 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు, పోలీసులు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులున్న భవనాన్ని చుట్టుముట్టారు. భద్రతాదళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులకి, భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.

ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి వచ్చిన తరువాత ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. అప్పటి నుండే భారత్ లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఈ దాడి జరిగింది. బహుశః భారత్-పాక్ మధ్య శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న శక్తులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close