జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పరిపాలన?

జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు పిడిపి శాసనసభ సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకి లేఖ కూడా అందజేశారు. కానీ దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి సంతాపంగా రాష్ట్రంలో నాలుగు రోజులు సంతాపం పాటిస్తునందున, వచ్చే ఆదివారం వరకు మెహబూబా ముఫ్తీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు. కనుక అంతవరకు రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన అమలులోకి వస్తుంది. దాని కోసం గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు. నేడో రేపో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలుచేస్తున్నట్లు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెహబూబా ముఫ్తీ పదవీ ప్రమాణం చేయగానే గవర్నర్ పరిపాలనను ఎత్తివేయబడుతుంది. అయితే ఇది రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు సాధాణంగా విధించే గవర్నర్ పాలన మాత్రం కాదని పిడిపి సీనియర్ నేత మరియు ఆ పార్టీ ఎంపి ముజఫ్ఫర్ హుస్సేయిన్ బేగ్ మీడియాకు చెప్పారు. ఇది కేవలం రాజ్యాంగ ఏర్పాటే తప్ప రాజ్యాంగ సంక్షోభం కాదని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close