బాబును నమ్ముతా… పోలవరం 2018కి పూర్తవదన్న పవన్

జనసేనాని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు అనూహ్యంగా పెరగడానికి కారణం పునరావాస ప్యాకేజీ వ్యయం పెరగడం అని తెదేపా నేతలు చెప్తున్నారని, అలాగే నిర్మాణ వ్యయం పెరగడం కూడా అంటున్నారన్నారు. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. నిధుల వ్యయo పై కేంద్రం సందేహించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అనుమానాలు నివృత్రి చేయాలని దీనికోసం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని సూచించారు. మన తప్పు లేనప్పుడు భయం అవసరం లేదన్నారు.

కేంద్రం కడతాం అంటే మేమె కడతాం అని తీసుకోవడం, ఇప్పుడు మళ్లీ ఇచ్చేస్తాం అనడం ఏమిటో తనకు అర్ధం కావడం లేదన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విషయం లో అవకతవకలుసహజమే అన్నారు. ఈ ప్రాజెక్టును ఇక ముందు తరచు సందర్శిస్తానని అవగాహన పెంచుకుంటానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2018కి పూర్తి కాదని స్పష్టం చేశారు. ఇక అలాంటి మాటలు చెప్పొద్దని వినీ వినీ విసుగొచ్చిందన్నారు. ఇప్పటిదాకా ఒక శాశ్వత సచివాలయం కట్టుకోలేకపోయాం అని అలాంటిది ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తాం అనడం నమ్మశక్యoగా లేదన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు, అనుభవం పై తన నమ్మకాన్ని ఆయన మళ్లీ వెలిబుచ్చారు. ఇంతకు ముందు బాబును నమ్మానని ఇప్పుడు కూడా నమ్ముతున్నా అని స్పష్టం చేశారు. అయితే తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రజల పక్షం అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close