తెలంగాణా లో కొత్త జిల్లాల కుదింపు?

తెలంగాణా ప్రభుత్వం 2016 లో దసరా పండుగ రోజున 31 జిల్లాలతో కొత్త తెలంగాణా మ్యాప్ ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. త్వరలో కొన్ని జిల్లాలను ప్రక్క జిల్లాల్లో విలీనం చేయనున్నట్టు, తద్వారా జిల్లాల సంఖ్య ని తగ్గించనున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలో అదనంగా ఏర్పాటు చేసిన పలు కొత్త జిల్లాలను కొనసాగించాల్సిన అవసరం ఉందా అని ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. స్థానిక అవసరాలు, ప్రజల డిమాండ్లు, నేతల ఒత్తిళ్ల కారణంగా 31 జిల్లాలు ఏర్పాటు చేసినా, పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని తెలంగాణా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. చివరి దశలో నేతల ఒత్తిళ్లతో తెరపైకి వచ్చిన కొత్త జిల్లాలు చిక్కులు తెచ్చిపెట్టాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది . ఈ క్రమంలో ఇప్పటికీ జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలు, అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను, పార్టీ ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పురమాయించినట్లు తెలిసింది. పైగా ఒక్కసారిగా జిల్లాల సంఖ్య బాగా పెరగటంతో ఉద్యోగుల సర్దుబాటు, అధికారుల నియామకం తలనొప్పిగా మారింది.

కాబట్టి అలా అదనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. వరంగల్‌ రూరల్‌ ( అర్బన్ లో విలీనం ?) , జనగాం, నిర్మల్, పెద్దపల్లి, మేడ్చల్‌ జిల్లాలు రద్దయ్యే జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. అయితే సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన కొత్త జిల్లాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. త్వరలో ఈ విషయం పై పూర్తి క్లారిటీ ప్రభుత్వం నుంచి రావచ్చని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close