“ఈనాడు” లోనూ తప్పులా?

నాగ చైతన్య తదుపరి చిత్రం గురించి ఈనాడు లో చిన్న ఆర్టికల్ వచ్చింది. ప్రస్తుతం సవ్యసాచి సినిమా తో బిజీగా ఉన్న నాగ చైతన్య తదుపరి చిత్రం దర్శకుడు శ్రీనివాస రెడ్డి తో ఉండవచ్చని వ్రాసింది. అక్కినేని నాగార్జునతో ‘ఢమరుకం’ తెరకెక్కించారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘ఢమరుకం’ చిత్ర రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ రాస్తున్నట్లు తెలుస్తోంది’ అని ఆ కథనం లో పేర్కొన్నారు.

కానీ ఆకుల శివ ఢమరుకం రచయిత కాదు. ఆకుల శివ ప్రధానంగా వివి వినాయక్ సినిమాలకి రచయిత. లక్ష్మీ, నాయక్ లాంటి సినిమాలకి పనిచేసాడు. ఢమరుకం రచయిత వెలిగొండ శ్రీనివాస్. వెలిగొండ శ్రీనివాస్ ఆ మధ్య అఖిల్ సినిమాకి కథ అందించాడు. పలు సినిమాలకి రచనా సహకారం అందించాడు. ఆ మధ్య రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన అంధగాడు సినిమా తో దర్శకుడు గా మారాడు.

మొత్తానికి ఈ సినిమాకి కథ అందిస్తోంది ఆకుల శివ యా లేక శ్రీనివాసా అన్న విషయం లో సంధిగ్దత సృష్టించింది ఈనాడు కథనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.