పవన్‌ యాత్రపై కోపాలేల?

జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ యాత్రపై మిగిలిన వారికన్నా కాంగ్రెస్‌,బిజెపిలే ఎక్కువగా దాడి చేస్తున్నారు. ఆయన పోటీ వల్ల టిఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్టు చీలిపోతాయన్న ఆందోళన వాటికి వుంది.టిఆర్‌ఎస్‌ వరకూ ఆయన వల్ల లాభమూ లేదు నష్టమూ లేదు అంటున్నది. అయితే ఇప్పటికే నాలుగైదు శిబిరాలుగా వున్న ప్రతిపక్షంలో పవన్‌ వంటి జనాకర్షక నాయకుడు వచ్చి ఓట్లు తెచ్చకుంటే తనకే మంచిదన్న ఆలోచన వారికి లోలోపల వుంది. గతంలో సూటిగా కెసిఆర్‌ కుటుంబంపై దాడి చేసిన పవన్‌ ఇప్పుడు మాత్రం ఆయన స్మార్ట్‌ నాయకుడని పొగుడుతున్నారు. కాంగ్రెస్‌లో నా అన్న వున్నాడని కూడా చెబుతున్నారు. ఇక బిజెపిని ఆయనే గతంలో బలపర్చి వున్నారు. ప్రధాని మోడీని కూడా ప్రశంసగానే మాట్లాడుతుంటారు.కనుక పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంచి తమకు నష్టం చేస్తారని కాంగ్రెస్‌ నాయకులు అనుకోవడం హాస్యాస్పదం. కెసిఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు ఏకరువు పెడుతూ వీటిని పవన్‌ ఎందుకు ఎదుర్కొవడం లేదు, కెసిఆర్‌ను ఎందుకు పొగుడుతున్నారని కాంగ్రెస్‌ బిజెపి నేతలు వాపోతున్నారు. అయితే ఇటు బిజెపి కేంద్రమంత్రసలే నిరంతరం పొగిడి పోతున్నారు. ఇక ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి వంటి కాంగ్రెస్‌ నాయకులు కూడా ఒకప్పుడు బాగానే కెసిఆర్‌ను పొగిడారు.వీళ్లంతా పొగడొచ్చు గాని పవన్‌ అంటే తప్పొచ్చిందా అని మా చర్చల్లో ప్రస్తావించాను. తెలంగాణలో పవన్‌ చెప్పినంత అద్భుతంగా అలరాలుతున్నదేమీ లేదు.చాలా సమస్యలున్న మాట నిజం.వాటిని ఎప్పుడు ఏమేరకు చెప్పాలన్నది ఆయన విచక్షణ.ఏ మేరకు ఆదరించాలన్నది ప్రజల నిర్ణయం. అంతేగాని ఆయన తెలంగాణ రావడమే తప్పనట్టు తిట్టిపోడయం తగని పని.ఈ యాత్రతో తెలంగాణలో అభిమానులను అలరించిన పవన్‌ రెండు రాష్ట్రాల మధ్య ఇనుపగోడ ఏదీ లేదని నిరూపించారు. ఆ మేరకు ఆయన అభినందనీయులు. తక్కిందంతా భవిష్యత్తులో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close