‘ఓటుకు నోటు’ ప్రదీప్‌కు టీడీపీ టికెట్

హైదరాబాద్: తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్య అనుచరుడు, ఓటుకు నోటు కేసులో ఏసీబీ ముందు హాజరైన తెలుగు యువత నేత ప్రదీప్ చౌదరి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిల బరిలో దిగారు. లోకేష్ ఆశీస్సులతో వెంగళరావు నగర్ డివిజన్ నుంచి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఇతను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు కూడా ప్రధాన అనుచరుడు. గ్రేటర్ హైదరాబాద్ తెలుగు యువత విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ స్థానానికి టీడీపీలోనే తీవ్ర పోటీ ఏర్పడటంతోపాటు, బీజేపీ ఈ డివిజన్‌ను తమకు కేటాయించాలని కోరినప్పటికీ, లోకేష్ ఆదేశాల మేరకు టికెట్‌ను ప్రదీప్‌కు కేటాయించినట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసు విచారణ సమయంలో కాల్ లిస్ట్‌లలో ప్రదీప్ చౌదరి నంబర్ పలుసార్లు కనబడటంతో తెలంగాణ ఏసీబీ పోలీసులు అతనికి నోటీసులు పంపి పిలిపించుకుని అనేకసార్లు విచారణ చేశారు. అయితే అరెస్ట్ చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close