మహేష్బాబు భలే మాటకారి. సెట్లో చాలా హుషారుగా ఉంటాడు. సైలెంట్గా జోకులు వేసేస్తుంటాడు. ఈ విషయం మహేష్తో పనిచేసిన ఎవ్వరైనా చెప్పేస్తారు. మహేష్ టార్గెట్ చేయని వ్యక్తులెవరూ ఉండరు. ఎవరిపైనైనా సరే, జోకులు పడిపోతాయి. ఆఖరికి అక్కయ్య మంజులపై కూడా. మంజుల ఇప్పుడు దర్శకురాలిగా మారింది. ఓ సినిమా తీసింది. అదే… ‘మనసుకు నచ్చింది’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తమ్ముడే కదా.. అని తన దగ్గర కూడా `దర్శకత్వ ప్రతిభ` చూపిద్దామనుకుంది మంజుల. ‘ఇంకో టైపులో చెబుతావా..’ అని సలహాలు ఇస్తుంటే… ‘ఇంకోకర్ని చూసుకో’ అంటూ మహేష్ కౌంటర్ వేశాడట. అంతే కాదు.. ”నాన్నా.. మంజుల ఆంటీ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయింది కదా.. తనతో ఎప్పుడు సినిమా చేస్తావ్” అని గౌతమ్ కృష్ణ.. మహేష్ని అడిగాడట. దానికి మహేష్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ”మీ ఆంటీతో సినిమా చేస్తే అదే నా ఆఖరి సినిమా అవుతుంది” అన్నాడట. అదీ.. మహేష్ పంచ్ పవర్. ఈ విషయాన్ని మంజులనే చెప్పింది. ఈ సినిమా గనుక హిట్టయితే మాత్రం… మంజులకు మహేష్ అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే… ”భవిష్యత్తులో అక్కతో కలసి సినిమా చేసే అవకాశం ఉంది” అని పబ్లిగ్గానే ప్రకటించాడు.