మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్లు స్టార్ హీరోల కేటగిరీలో ఫస్ట్ వస్తారు. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులు ఎంతమంది వున్నా సెకండ్ ప్లేస్. విడుదల తేదీల విషయంలో తమ ఫ్యామిలీ హీరోలతో పోటీ పడడం మెగా హీరోలకు సుతరామూ ఇష్టం లేదు. తొలిప్రేమ, ఇంటెలిజెంట్ క్లాష్ తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు. అదే రెండిటిలో పవన్, చరణ్, బన్నిల సినిమా ఏదో ఒకటి ఉండుంటే మరో సినిమాను మినిమమ్ మూడు వారాలు వాయిదా వేసేవారని మెగా కాంపౌండ్ టాక్.
చిరు, పవన్, చరణ్, బన్ని నటించిన సినిమాలు సేమ్ సీజన్లో విడుదలకు రెడీ అయితే వాటి మధ్య మినిమమ్ మూడు వారాలు గ్యాప్ వుండాలని మెగా రాజ్యాంగంలో ఒక రూల్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మే నెలకు వెళ్ళడం వెనుక ఇది కూడా ఒక కారణం. ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు ఏప్రిల్ వీకెండ్ రిలీజ్ డేట్ కోసం కొట్టుకున్నాయి. రాజీ చర్చలు జరిగిన సమయంలో మహేశ్ బాబు మే నెలలో తన సినిమాలో విడుదల చేయడానికి ఒప్పుకోలేదట. ఆయన సినిమా మే నెలలో వస్తే ప్లాప్ అనే సెంటిమెంట్ దీనికి కారణమట. ఏప్రిల్ వీకెండ్ కంటే ముందు రావడానికి మహేశ్ మొగ్గు చూపించాడు. నిజానికి ఏప్రిల్ వీకెండ్ కంటే ముందు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను విడుదల చేయడం మెగా కాంపౌండ్కి ఇష్టం లేదు.
మార్చ్ మంత్ ఎండ్లో 30న రామ్ చరణ్ ‘రంగస్థలం’ వస్తుంది. ఎంత లేదన్నా ఏప్రిల్ మూడో వారానికి కొన్ని థియేటర్లలో సినిమా వుంటుంది. అప్పుడు అల్లు అర్జున్ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు కొత్త సినిమా వైపు మొగ్గు చూపుతారు. ‘రంగస్థలం’ వసూళ్ళకు కాస్త గండి పడుతుంది. ఒకవేళ మహేశ్ మాటకు విలువిచ్చి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను మే నెలకు షిఫ్ట్ చేస్తే నో ప్రాబ్లమ్. అభిమానులు రెండు సినిమాలను చూస్తారు. భవిష్యత్తులోనూ మెగా సినిమాల విడుదల మధ్య మూడు వారాలు గ్యాప్ వుండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఎక్కువమంది హీరోలు వస్తే ఇలాంటి సమస్యలు తప్పవేమో!