ఫస్ట్… లాస్ట్… శ్రీదేవి మెమరీస్

భూమ్మీద శ్రీదేవి యాభై నాలుగేళ్ళు బతికితే అందులో యాభై ఏళ్ళ జీవితాన్ని నటనకు అంకితం చేసింది. నాలుగేళ్ళ వయసు నుంచి నటించడం మొదలుపెట్టిన శ్రీదేవి మొత్తం ఐదు భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి మొత్తం మూడు వందల సినిమాలు చేస్తే… అందులో కథానాయికగా చేసినవి రెండు వందల యాభైకు పైగా వుండడం విశేషం. ప్రతి వ్యక్తికి జీవితంలో తొలి అడుగు, చివరి అడుగు చిరస్థాయిగా నిలుస్తాయి. శ్రీదేవి తుది శ్వాస విడిచిన తరుణంలో ఆమె ప్రతి భాషలో చేసిన తొలి, చివరి సినిమాల వివరాలు….

తమిళంలో…

బాలనటిగా తొలి సినిమా: ‘తునైవన్‌’ (1969)
కథానాయికగా తొలి సినిమా: ‘మూండ్రు ముడిచ్చు’
1976లో విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్-కమల్ హాసన్ హీరోలు.
చివరి సినిమా: ‘పులి’
2015లో విడుదలైంది. విజయ్ హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ హన్సికకు తల్లిగా, మహారాణిగా శ్రీదేవి నటించారు.

హిందీలో…

బాలనటిగా తొలి సినిమా: ‘రాణీ మేరానామ్‌’ (1972)
కథానాయికగా తొలి సినిమా: ‘సోల్వా సావన్‌’
1979లో విడుదలైన ఈ సినిమా ‘వసంత కోకిల’కు రీమేక్. ఇందులో అమోల్ పాలేకర్ హీరో
హిందీలో ఆఖరి సినిమా: ‘మామ్‌’
2017లో విడుదలైందీ లేడీ ఓరియెంటెడ్ సినిమా. ‘మామ్’ కాకుండా షారుఖ్ ఖాన్ ‘జీరో’లో అతిథి పాత్ర చేశారు. ఈ ఏడాది ‘జీరో’ విడుదల కానుంది.

కన్నడంలో…

తొలి సినిమా: ‘భక్త కుంబారా’ (1974)
చివరి సినిమా: ‘ప్రియ’ (1979)

తెలుగులో…

బాలనటిగా తొలి సినిమా: ‘మానాన్న నిర్దోషి’ (1970)
కథానాయికగా తొలి సినిమా: ‘అనురాగాలు’ (1976)
చివరి సినిమా: ‘ఎస్‌.పి.పరశురామ్‌’
1994లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి హీరో. ఆ తర్వాత తెలుగులో శ్రీదేవి సినిమా చేయలేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు.

మలయాళంలో…

తొలి సినిమా: ‘కుమార సంభవం’ (1969)
చివరి సినిమా: ‘దేవరాగం’ (1996)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close