చిరు, వెంకీ, నాగ్‌.. డుమ్మాకొట్టేశారుగా!

శ్రీ‌దేవి సంతాప స‌భ‌ని తెలుగు చిత్ర‌సీమ జ‌ర‌పాల్సింది. కానీ.. ఆ ‘ఖ‌ర్చు’ లేకుండా చేశారు టి.సుబ్బిరామిరెడ్డి. ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో శ్రీ‌దేవి సంతాప స‌భ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌దేవితో అనుబంధం ఉన్న స్టార్ హీరోల్ని, హీరోయిన్లనీ, ద‌ర్శ‌కుల్నీ ఆహ్వానించారాయ‌న‌. చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వ‌స్తార‌ని చెప్పారు. కానీ… వాళ్లంతా ఈ సంతాప స‌భ‌కు డుమ్మా కొట్టేశారు. కృష్ణ లాంటి సీనియ‌ర్ న‌టుడూ రాలేదు. మోహ‌న్ బాబు ఆచూకీ కూడా లేదు. చిరంజీవికి వేరే అప్పాయింట్ మెంట్ ఉంద‌ని, ఆయ‌న ఊర్లో లేర‌ని అల్లు అర‌వింద్ ‘వార్త‌’ మోసుకొచ్చారు. కృష్ణ‌కు న‌డుం నొప్పి అట‌. మోహ‌న్ బాబు కూడా ఊర్లో లేరు. ఆయ‌న ప్ర‌స్తుతం తిరుప‌తిలో ఉన్నారు. మ‌రి బాల‌కృష్ణ‌, వెంకీ, నాగ్‌ల మాటేంటి?? త‌న‌తో సినిమా చేయ‌క‌పోయినా.. నాన్న‌తో సినిమాలు చేసినందుకైనా బాల‌య్య రావాల్సింది. ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క‌రూ క‌నిపించ‌లేదు. అమ‌ల మాత్రం వ‌చ్చి, త‌న శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించింది. శ్రీ‌దేవితో 24 సినిమాలు చేసిన రాఘ‌వేంద్ర‌రావు జాడ లేకుండా పోయింది. మొత్తానికి స్టార్లెవ‌రూ లేకుండానే సంతాప స‌భ ముగిసిపోయింది.

ఈ సంతాప స‌భ‌తో చిత్ర‌సీమ కూడా చేతులు దులుపుకున్న‌ట్టే. ఎందుకంటే `మా` నుంచి కూడా ప్ర‌త్యేకంగా వేరే సంతాప స‌భ‌లేం లేవు. ‘మేం సంతాప స‌భ నిర్వ‌హిద్దాం అనుకున్నాం.. కానీ ఆ అవ‌కాశం సుబ్బిరామిరెడ్డిగారు తీసేసుకున్నారు’ అని తేల్చేశారు మా అధ్య‌క్షుడు శివాజీ రాజా. తెలుగు చిత్ర‌సీమ ఓ అపురూప‌మైన న‌టికి ఇచ్చిన గౌర‌వం ఇది. క‌నీసం సుబ్బిరామిరెడ్డి సంతాప స‌భ‌కైనా మిగిలిన స్టార్లంతా వ‌చ్చి ఉంటే బాగుండేది. కానీ.. ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close