కోటి రూపాయ‌ల క‌థ‌… ఆ మాత్రం ఉంటుంది మ‌రి!

ఇప్పుడంద‌రి చ‌ర్చా.. ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాపైనే. బుధ‌వారం విడుద‌ల చేసిన టీజ‌ర్ చూశాక‌.. అంద‌రి మైండూ బ్లాక్ అయిపోయింది. వ‌రుస‌గా రెండు ఫ్లాపుల త‌ర‌వాత‌.. మ‌హేష్ బాబు నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఆ లెక్క‌ల‌న్నీ స‌రి చేసేలా ఉంది. ఇంత ఇంటెన్సిటీ ఉన్న టీజ‌ర్ ఈమ‌ధ్య కాలంలో రాలేదేమో. అన‌వ‌స‌ర‌మైన బిల్డ‌ప్ షాట్లూ, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా డైలాగులు ఇవేం వాడ‌కుండా.. సింపుల్‌గా క్లీన్‌గా చెప్పాల్సింది చెప్పేశాడు కొర‌టాల‌. ఓ విధంగా చెప్పాలంటే.. ఆడియ‌న్స్‌కి ముందే ప్రిపేర్ చేసి ఉంచాడు.

టీజ‌ర్ చూశాక‌.. మ‌హేష్‌ఫ్యాన్స్ లో ధైర్యం పెరిగింది. ఈ సినిమాపై న‌మ్మాకాలు ఏర్పాడ్డాయి. క‌చ్చితంగా ఈ వేస‌విలో… భ‌ర‌త్ అనే నేను సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతోంది అనేది అర్థ‌మైంది. క‌థ‌లో ద‌మ్మున్న‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి ట్రైల‌ర్లు, టీజ‌ర్లు క‌ట్ చేయొచ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అదీ నిజ‌మే. ఈ క‌థ‌ని మ‌హేష్‌, కొర‌టాల అంత న‌మ్మారు. అస‌లు నిజం ఏమిటంటే.. ఈ క‌థ కొర‌టాల‌ది కాదు. మ‌రో ర‌చ‌యిత‌ద‌ది. కొర‌టాల శివ స్వ‌త‌హాగా క‌థ‌కుడు. అయినా స‌రే మ‌రొక‌రి నుంచి క‌థ కొనుక్కున్నాడు. ఏకంగా కోటి రూపాయ‌లు ఇచ్చి. అంత ఇచ్చాక‌.. ఇంత ఇంటెన్సిటీ క‌నిపించ‌కుండా ఎలా ఉంటుంది.? మ‌రి టైటిల్స్‌లో ర‌చ‌యిత‌కు క్రెడిట్ ఇస్తారో, క్యాష్‌తో స‌రిపెట్టేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close