నాన్నకు ప్రేమతోకు మహేష్, చరణ్ అభినందనల వెల్లువ ..!

స్టార్ హీరోలు ఈ మధ్య తమ పంథా మార్చుకున్నారు. ఓ హీరో సినిమా వచ్చిందంటే దాని గురించి పొగడటం పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ దారిలో ముందున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. శ్రీమంతుడు సినిమా టైంలో సినిమా చూసి మహేష్ కు ఫోన్ చేసి సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్న చరణ్. తాజాగా నాన్నకు ప్రేమతోతో సూపర్ సక్సెస్ అందుకున్న సందర్భంగా తారక్ కు ఫోన్ చేసి కూడా తన అభినందనలు తెలిపాడట. అంతేకాదు సినిమాలో ఎన్.టి.ఆర్ నటనకు తాను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది.

సినిమాకు సంగీతం కూడా బాగా కుదిరిందని.. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తారక్ నటన, సాంగ్ తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నాడట. ఇక సినిమా చూసిన మహేష్ కూడా తన విశెష్ ని తారక్ కు అందించాడని అంటున్నారు. సినిమా దర్శకుడు సుకుమార్ కు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్టు సమాచారం. టెంపర్ తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో మొదట కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.

ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాము ఎంత స్టార్ స్టేటస్ లో ఉన్నా సాటి హీరోలకు ఎటువంటి ఈగోలకు పోకుండా సిన్సియర్ గా సినిమా గురించి ఫోన్ చేసి మాట్లాడటం మంచి విషయమే అంటున్నారు సిని విశ్లేషకులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close