తేజ మాటిచ్చాడు స‌రే… బాల‌య్య ఒప్పుకుంటాడా?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌కృష్ణ త‌ర‌వాత‌… ఎవ‌రి పేరూ ప‌క్కా కాలేదు. విద్యాబాల‌న్ న‌టిస్తోంది అని చెబుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె పేరు ఖ‌రారు కాలేదు. చిత్ర‌బృందం కూడా ఈ విష‌యంలో నోరు మెద‌ప‌డం లేదు. బాల‌య్య త‌ర‌వాత అధికారికంగా ప‌క్కా అయిన పేరు ఏదైనా ఉందీ అంటే… అది శ్రీ‌రెడ్డిదే. ఆమె ఎంట్రీ అటు నంద‌మూరి అభిమానుల్లోనే కాదు, చిత్ర‌సీమ‌నూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓ తెలుగ‌మ్మాయికి సినిమాలో అవ‌కాశం ఇవ్వాల‌నుకోవ‌డం నిజంగా తేజ గొప్ప హృద‌యానికి నిద‌ర్శ‌నం. అయితే… ఇక్క‌డొచ్చిన చిక్కేంటంటే.. శ్రీ‌రెడ్డి రాక బాల‌య్య‌కు ఇష్ట‌మా, కాదా? అనేదే.

ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో బాల‌య్య చాలా క్లియ‌ర్‌గా ఉన్నాడు. ఏయే పాత్ర‌లో ఎవ‌రెవ‌రు న‌టించాలి? అనే విష‌యంలో ఇప్ప‌టికే ఆయ‌న‌కంటూ ఓ స్ప‌ష్ట‌త ఉంది. ఈ విష‌యంలో తేజ జోక్యం కూడా ఆయ‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డి ఎంపిక ని బాల‌య్య ఓకే చేస్తాడా, లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తేజ మాటల్లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీ‌రెడ్డికి కీల‌క‌మైన పాత్ర ఇవ్వ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఏదో చిన్నా చిత‌కా పాత్ర అయితే బాల‌య్య కూడా ప‌ట్టించుకోక‌పోదుడు. `కీల‌క‌మైన‌` అనేస‌రికి చిక్కుముడి ప‌డే అవ‌కాశం ఉంది. వెంక‌టేష్ సినిమాలో శ్రీ‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌డం ప‌ట్ల‌.. అటు వెంకీకి ఇటు సురేష్‌బాబుకీ ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవచ్చు. స‌మ‌స్య ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలోనే. మ‌రి బాల‌య్య‌ని ఒప్పించి తేజ ఇచ్చిన మాట ఎలా నిల‌బెట్టుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close