కొర‌టాల ఈసారి రూటు మారుస్తున్నాడా?

కొర‌టాల శివ‌.. టాలీవుడ్‌లో టాప్ 3 ద‌ర్శ‌కుల్లో త‌నొక‌డు. వ‌రుస‌గా నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడు. మిర్చి ద‌గ్గ‌రి నుంచే అగ్ర హీరోల దృష్టిలో ప‌డిపోయాడు కొర‌టాల‌. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌ల‌తో టాప్ ఛైర్ సంపాదించుకున్నాడు. భ‌ర‌త్ అనే నేనుతో మ‌రో మెట్టు పైకి ఎక్కాడు. ఓ మంచి పాయింట్‌కి క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ జోడించి సినిమాలు తీసి స‌క్సెస్ కొట్టాడు. కొర‌టాల శివ సినిమా అంటే.. క‌చ్చితంగా అందులో సోష‌ల్ ఎలిమెంట్ ఏదో ఒక‌టి ఉండి తీరుతుంద‌ని జ‌నాలు ఫిక్స‌యిపోతున్నారు. అయితే ఈసారి కొర‌టాల రూటు మార్చ‌బోతున్నాడు. సోష‌ల్ మెసేజీల జోలికి పోకుండా పూర్తి స్థాయి క‌మర్షియ‌ల్ సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. ”ఈసారి ఎలాంటి మెసేజీలూ లేని ఓ పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తా. ఆ త‌ర‌హా జోన‌ర్ కూడా ఓసారి ట్రై చేయాల‌ని వుంది. ఎలాంటి క‌థ చేయాలి? ఎవ‌రితో చేయాలి? అనేవి ఇంకా ఆలోచించ‌లేదు. ఒక్క‌టి మాత్రం నిజం.. ఈసారి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా రాబోతోంది” అని హింట్ ఇచ్చేశాడు.కొర‌టాల త‌దుప‌రి సినిమా అల్లు అర్జున్‌తో ఖాయ‌మైంద‌ని న్యూస్‌. దీనిపై కొర‌టాల స్పందించాడు. ”ఇప్పుడిప్పుడే భ‌ర‌త్ నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ముందు కొన్ని రోజులు హాలీడే తీసుకుంటా. ఆ త‌ర‌వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా” అంటున్నాడు కొర‌టాల‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close