‘అర్జున్‌రెడ్డి’తో దత్ ఫ్యామిలీ డబుల్ డీల్…

‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండకి యూత్ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ బావుంది. దీంతో అగ్ర నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో గీతా ఆర్ట్స్ ముందుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హీరో క్రేజ్ అంచనా వేసి అతడితో రెండు సినిమాలు చేసేలా డీల్ మాట్లాడారు. ఫస్ట్ సినిమా ‘టాక్సీవాలా’ టీజర్ రిలీజ్ చేశారు. సెకండ్ సినిమా ‘గీత గోవిందం’ సెట్స్ మీదుంది. గీతా ఆర్ట్స్ తరవాత అశ్వినీదత్ డాటర్స్ విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాలు చేసేలా డీల్ సెట్ చేసుకున్నారని టాక్. అసలు, అతడి పేస్ ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యేలా క్యారెక్టర్ ఇచ్చింది దత్ ఫ్యామిలీయే. నాగఅశ్విన్ దర్శకత్వంలో దత్ డాటర్స్ నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో రిషి క్యారెక్టర్‌తో విజయ్ దేవరకొండకు గుర్తింపు లభించింది. తరవాత ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’లతో క్రేజ్ వచ్చింది. హీరోగా ఎంత పేరు వచ్చినా ముందు తనకు రిషి క్యారెక్టర్ ఇచ్చిన నాగఅశ్విన్‌, స్వప్న సినిమాస్ సంస్థపై కృతజ్ఞతతో ‘మహానటి’లో క్యారెక్టర్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దత్ ఫ్యామిలీ నిర్మించే రెండు సినిమాల్లో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశాడట.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై విజయ్‌ దేవరకొండ హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే, రాజు డి.కె. దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా తెరకెక్కించానున్నారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయి, ఎప్పుడు విడుదల అవుతాయనే విషయాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం విజయ్ తెలుగు, తమిళ సీఎంగా ‘నోటా’ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక ఈ రెండిటిలో ఏదో ఒకటి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close