పవన్ కు మద్దతిద్దామన్న ప్రకాశ్ రాజ్

ఇటీవలి కాలంలో బిజెపి పార్టీ పై మాటల తూటాలు పేలుస్తూ బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ఆంధ్ర రాజకీయాలపై కూడా మాట్లాడారు. ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు మద్దతివ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు.

ముందు కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాననీ, ప్రస్తుతానికి కేవలం బీజేపీ నే ప్రశ్నించినా భవిష్యత్తులో మిగతా పార్టీలను కూడా ఇలాగే ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు. ఇక జనసేనపై వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు మంచిచేయాలనే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారని, పేరు కోసం,డబ్బు కోసం పెట్టలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే కావల్సినంత పాపులారిటీ, డబ్బు ఉన్నాయన్నారు ప్రకాష్ రాజ్. అయితే పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ పెట్టాక ఎంతో మంది వస్తారు కానీ ఆయన ఆలోచనపరంగా ఎంతమంది వచ్చి చేరుతారు అనేది చూడాలి అన్నారు. అలాగే ఆయన ఆలోచనలతో ఏకీభవించి కాకుండా వేరే ప్రయోజనాలు ఆశించి వచ్చే వారి గురించి జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే వలసనేతలతో కూడా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వారే పార్టీని ముంచేసే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ కి సూచనలు చేశారు ప్రకాష్ రాజ్.

పవన్‌ ముక్కుసూటిగా ఉంటారని, ఆయన ప్రయత్నం మంచిదేనని అన్న ప్రకాష్‌రాజ్‌, ఆయనలా పార్టీ పెట్టి తాను రాజకీయం చేయలేనని, మంచి చేయాలని వస్తున్న పవన్‌ను ఆహ్వానిద్దామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close