ఆంటోని , నీలాంబరి కి దీటుగా నానాపటేకర్‌ పాత్ర : రజనీ

రజనీకాంత్ తన కొత్త సినిమా “కాలా” ఆడియో ఫంక్షన్ లో రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖలు చేశారు. ధనుష్ నిర్మాణంలో రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.

తన సినిమాలోని ఈ విలన్ ల గురించి మాట్లాడుతూ రజనీకాంత్, తాను నటించిన చిత్రాల్లో తనకు నచ్చిన విలన్లు ఇద్దరేనని, ఒకరు ‘బాషా’ చిత్రంలో ఆంటోని (రఘువరన్‌) కాగా, మరొకరు ‘పడయప్పా’ నీలాంబరి (రమ్యకృష్ణ) అని, ఆ ఇద్దరికి దీటుగా కాలా చిత్రంలో నానాపటేకర్‌ హరిదారా పాత్ర ద్వారా విలన్‌గా నటించారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు నానాపటేకర్ దక్షిణాది సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సినిమాలో దర్శకుడి పాత్ర తో మెప్పించారు. అయితే పాత్ర ఎంతో నచ్చితే తప్ప ఆయన దక్షిణాది చిత్రాలు ఒప్పుకోవడం లేదు. ఈ లెక్కన నానాపటేకర్ నటనను అభిమానించే ప్రేక్షకులకు ఈ చిత్రం కనువిందు చేయనునట్టే.

దర్శకుడితో రజనీకాంత్ కబాలి తర్వాత రెండవ సారి ఈ చిత్రంతో పనిచేస్తున్నారు. కబాలి సినిమా ఆశించిన విజయం సాధించలేదు మరి ఈసారైనా రంజిత్ రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా అనేది జూన్ మొదటి వారంలో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close