పంచ‌భూతాలు… పంచ గాయ‌కులు

ఓ పాట‌ని ఇది వ‌ర‌కు ఒకే గాయ‌కుడు పాడే వాడు. ఆ త‌ర‌వాత వెరైటీ కోసం ఇద్ద‌రు గాయ‌కుల‌తో పాడించ‌డం మొద‌లెట్టారు. ఈసారి ఒకే పాట‌ని అయిదుగురు గాయ‌కుల‌తో పాడించారు. `సాక్ష్యం` కోసం. కాక‌పోతే.. ఈ పాట ఓ కాన్సెప్ట్ ప్ర‌కారం సాగిపోతుంద‌ట‌. పంచ‌భూతాల నేప‌థ్యంలో న‌డిచే క‌థ `సాక్ష్యం`. పంచ‌భూతాల విశిష్ట‌త‌ను చెబుతూ ఓ పాట కంపోజ్ చేశారు ఈ సినిమాలో. అది సినిమాలో అక్క‌డ‌క్క‌డ సంద‌ర్భానుసారం వ‌స్తుంటుంది. ఈ పాట‌ని అయిదుగురు గాయ‌కుల‌తో పాడించారు. ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, జేసుదాస్‌, హ‌రిహ‌ర‌న్‌, కైలాష్ ఖేర్‌, బోంబే జ‌య‌శ్రీ ఈ పాట‌ని ఆల‌పించారు. అయిదుగురూ పెద్ద గాయ‌కులే. అనంత శ్రీ‌రామ్ ఈ పాట‌ని అందించారు. ఓ థీమ్ ప్ర‌కారం సాగే ఈ పాట‌.. సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్, పూజా హెడ్గే జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు. జులై 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close