కడప స్టీల్ ప్లాంట్ అంశం… కేంద్రానికి చీమకుట్టినట్టైనా లేదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాజ‌పా నేత‌లు మైకావేశంతో చాలాచాలా మాట్లాడ‌తారు! ఆంధ్రాకి అన్నీ ఇచ్చెయ్య‌డానికి కేంద్రం సిద్ధంగా కూర్చుకుని ఉంటే, ఎలా తీసుకెళ్లాలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలీడం లేద‌న్న‌ట్టు మాట్లాడ‌తారు! కానీ, ఢిల్లీ స్థాయిలో భాజ‌పా నేత‌ల వైఖ‌రి మ‌రోలా ఉంటోంది. వారికి క‌నీసం చీమ‌కుట్టిన‌ట్టైనా ఉండ‌టం లేదు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ విష‌య‌మై మ‌రోసారి ఢిల్లీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేశారు టీడీపీ నేత‌లు. రాయ‌ల‌సీమ ప్రాంత నేత‌ల‌తోపాటు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర‌మంత్రి బీరేంద్ర సింగ్ ను క‌లుసుకున్నారు. క‌డ‌ప ప్లాంటును వెంట‌నే ప్ర‌క‌టించాలంటూ ఆయ‌న్ని కోరారు. అయితే, మ‌ళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతారు, ఒక‌సారి చెప్పాం క‌దా అన్న‌ట్టుగానే ఆయ‌న స‌మాధానం ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లో క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు క‌ట్టిన‌ట్టు చెప్పేయ‌డం విశేషం.

క‌డ‌ప స్టీల్ అంశ‌మై టీడీపీ ఎంపీలు రాష్ట్రప‌తిని కూడా క‌లిశారు. టీడీపీ నేత‌లంద‌రికీ అనుమ‌తి లేద‌న‌డంతో, కొంత‌మంది ఎంపీల‌తో కూడిన ప్ర‌తినిధుల బృందం రామ్ నాథ్ కోవింద్ కి విన‌తిప‌త్రం ఇచ్చారు. సీఎం ర‌మేష్‌, రామ్మోహ‌న్ నాయుడు, మాజీ కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజులు రాష్ట్రప‌తిని క‌లిసినవారిలో ఉన్నారు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ విష‌య‌మై సీఎం ర‌మేష్ చేసిన దీక్ష గురించి తాను విన్నానంటూ రాష్ట్రప‌తి సానుకూలంగానే స్పందించారు. అయితే, ఆయ‌న‌కి విన‌తి ప‌త్రం ఇచ్చినంత మాత్రాన‌… కేంద్ర ప్ర‌భుత్వానికి ఆయ‌న సూచిస్తార‌ని ఆశించ‌లేం. ఒక‌వేళ మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌ధానికి రాష్ట్రప‌తి సూచించే ప్ర‌య‌త్నం చేసినా… దాన్ని మోడీ ఎంత సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌నేది ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేని విష‌యం!

ఏదేమైనా, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల విష‌య‌మై కేంద్రం చిత్త‌శుద్ధి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఓప‌క్క‌, ఈ పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసేలోగానే క‌డ‌ప ప్లాంట్ ప్ర‌క‌టించేస్తార‌న్న‌ట్టుగా ఏపీ భాజ‌పా నేత‌లు ఇక్క‌డ మాట్లాడ‌తారు. కానీ, కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ మాత్రం ఈ సెష‌న్స్ లో అలాంటి ప్ర‌క‌ట‌న‌కు ఆస్కార‌మే లేద‌నీ, ఇంకా మెకాన్ సంస్థ నుంచి నివేదిక రావాల్సి ఉంద‌ని చెబుతారు. ఒక‌వేళ కేంద్రానికి నిజంగానే చిత్త‌శుద్ధి ఉంటే… మెకాన్ సంస్థ నుంచి నివేదిక తెప్పించుకోవ‌డం అనేది ఎంత ప‌ని..? కేంద్రం అన్నీ ఇచ్చేస్తుంద‌ని ఏపీ నేత‌లు అంటారు… కానీ, కేంద్ర‌మంత్రుల తీరు ఇంకోలా ఉంటోంది. ఏదేమైనా, ప‌ట్టువ‌ద‌లక టీడీపీ ఎంపీలు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close