సెలవుపై వెళ్ళిన వీసీ అప్పారావు: సస్పెండ్ చేయమన్న ప్రొఫెసర్‌కే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. వైస్ ఛాన్సలర్ అప్పారావును సెలవుపై పంపించింది. ఆయన స్థానంలో యూనివర్సిటీలోని ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించింది. విశేషమేమిటంటే రోహిత్, అతని అనుచరులను గతంలో సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన కమిటీకి శ్రీవాత్సవ నాయకత్వం వహించారు. మరోవైపు ఈ పరిణామంపై విద్యార్థులు మరింత మండిపడుతున్నారు. వీసీ అప్పారావును సెలవుపై పంపిస్తే సరిపోదని, అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్స్ చేసిన ప్రొఫెసర్‌కే ఇన్ ఛార్జ్ వీసీ బాధ్యతలు అప్పగించటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవటం వంటి ఐదు డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఏడుగురు విద్యార్థుల నిరసనను భగ్నం చేసి నిన్న ఆసుపత్రిలో చేర్చటంతో వారి స్థానంలో మరో ఏడుగురు విద్యార్థులు ఇవాళ దీక్ష ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును తొలగించటం, రోహిత్ కుటుంబానికి రు.50 లక్షల పరిహారం చెల్లింపు వంటి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు దీక్ష కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు. ఇక నిన్న ఆసుపత్రిలో చేర్చిన ఏడుగురు విద్యార్థులలో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో వారిని ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్ చేయమని చెప్పినట్లు యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర కుమార్ చెప్పారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. మరోవైపు దీక్షలకు సారధ్యం వహిస్తున్న జేఏసీ రేపు చలో హెచ్‌సీయూ కార్యక్రమం నిర్వహించనుంది. అటు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీని దర్శించి రోహిత్ సహచరులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close