కశ్మీర్‌లో కొత్త కుంపటి 35-ఏ…! మరోసారి టెన్షన్ ..టెన్షన్ ..!

జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదాస్పద ఆర్టికల్ 35-ఏ ఆ రాష్ట్రాన్ని ఉద్రిక్త పరిస్థితుల్లో మరోసారి నెట్టింది. ఈ అధికరణను తొలిగించాలంటూ సంఘ్‌పరివార్‌కు చెందిన “వి ద సిటిజన్స్” సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఆర్టికల్ 35-ఏను తొలగిస్తారంటూ కశ్మీర్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ, వేర్పాటువాద సంస్థలు రెండు రోజులుగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆర్టికల్‌ను తొలిగిస్తే ఊరుకునేది లేదని, కశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామని వేర్పాటువాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేంద్రం తీరును రెండురోజుల నుంచి బంద్‌ పాటిస్తున్నారు.

ఆర్టికల్ 35-ఏను కొనసాగించాల్సిందేనని కశ్మీర్‌లోని రెండు ప్రధాన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ డిమాండ్ చేస్తున్నాయి. రెండు పార్టీలు వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ కశ్మీర్ ప్రజల హక్కు అని, దాన్ని తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లేకుంటే భారత్‌తో జమ్ముకశ్మీర్‌కు సంబంధం ఏమిటనేది ఆయా పార్టీల వాదన. మరో వైపు బీజేపీ మాత్రం ఆర్టికల్ 35-ఏను తొలగించాలన్నదే తమ విధానమంటోంది. కశ్మీర్ అభివృద్ధికి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారిందని బీజేపీ చెబుతోంది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఆర్టికల్ 35-ఏను భారత రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమించాయి. బయటి వ్యక్తుల రాకను ఈ ఆర్టికల్ అరికడుతుంది. ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్‌లో ఆస్తులు కొనరాదు. స్థిర నివాసం ఏర్పరుచుకోకూడదు. పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు.

ఇవాళ జరగనున్న విచారణను.. వాయిదా వేయాలని… గవర్నర్ ..సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ప్రస్తుతం కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉంది. త్వరలో పంచాయితీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కారమంగా వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం విన్నవించింది. విచారణ జరుగుతుందా..? జరిగితే.. 35-ఏ రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించడం కష్టమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close