’24’లో సూర్య డిఫరెంట్‌ లుక్‌ అదిరింది!

తను చేసే ప్రతి క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా వుండాలని ఆలోచించే సూర్య లేటెస్ట్‌గా విక్రమ్‌కుమార్‌ డైరెక్షన్‌లో ’24’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌ స్పెషల్‌గా ’24’ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు సూర్య. స్టూడియో గ్రీన్‌, 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ఇష్క్‌, మనం వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ చేసిన విక్రమ్‌కుమార్‌ తమిళ్‌లో ’13బి’ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. టైమ్‌ ట్రావెల్‌ని బేస్‌ చేసుకొని తయారు చేసిన ఈ కథకి, ’24’ అనే టైటిల్‌కి ఎలాంటి సంబంధం వుంది, ఇది ఎలాంటి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా అనేది సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే రివీల్‌ అయ్యే అవకాశ వుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయినప్పటికీ ఈరోజు సూర్య కొత్త గెటప్‌తో రిలీజ్‌ అయిన పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడీ పోస్టరే కోలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు ఆడియన్స్‌ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close