కష్టంలో ఒక్కటిగా నందమూరి ఫ్యామిలీ..! మనసు విప్పి మాట్లాడుకున్న బాబాయ్ అబ్బాయిలు..!!

కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేదే కుటుంబం. కుటుంబం అన్నాక.. అన్నీ సవ్యంగా ఉండవు. కోపాలుంటాయి.. తాపాయింటాయి, ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నందమూరి కుటుంబం ఇవి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. సినీ, రాజకీయరంగాల్లో ఆ కుటుంబం చాలా పవర్ ఫుల్. ఒకరికి ప్రాధాన్యం దక్కలేదని మరొకరు.. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని మరొకరు… ఇలా ఫీలయ్యేవాళ్లూ ఉంటారు. కానీ అవన్నీ అంతర్గతమే. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది నందమూరి కుటుంబం. హరికృష్ణ హఠాన్మరణంతో.. నందమూరి కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. అన్న కుమారులుకు ధైర్యం చెప్పారు. అన్నీ పనులూ దగ్గరుండి చేసుకున్నారు. వారికి ఏ లోటు లేకుండా చేసుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు హరికృష్ణ కుటుంబంతో పాటే ఉన్నారు. హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ కూడా అంతే. బాలకృష్ణకు హరికృష్ణ సోదరులకు మధ్య మాటల్లేవని ఈ మధ్య కాలంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగా సినిమా ఫంక్షన్లు కానీ.. రాజకీయ వేడుకల్లో కానీ… ఒకరికొకరు ఎదురుపడిన సందర్భం లేదు. ఆ రూమర్స్ అలానే ఉండిపోయాయి. వాటిలో ఎంత వరకూ నిజం ఉందో కానీ… ఇప్పుడు మాత్రం అవన్నీ దూది పింజ్లా తేలిపోయాయి. అబ్బాయిలతో బాబాయ్ … అన్నిఅంశాలు చర్చిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

అనుకోకుండా వచ్చిన ఓ పెద్ద కష్టం మళ్లీ నందమూరి కుటుంబాన్ని ఏకం చేసినట్లే చెప్పుకోవాలి. ఇక కుటుంబ పెద్దగా.. అబ్బాయిలకు అండగా ఉంటాని.. మాటల్లో కాకుండా.. చేతల్లోనే చూపించారు నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మరణమే నేపధ్యంగా… ఆ కుటుంబంలో ఉన్న బేధాభిప్రాయాలను… అంతకంతకూ పెంచి… రాజకీయంగా లబ్ది పొందాలని.. అప్పటికే కొంత మంది ప్రయత్నాలు చేశారు. అలాంటి కుట్రలు ఫలించవని.. బాబాయ్ – అబ్బాయిలు మనసు విప్పి మాట్లాడుకుంటూ కనిపించి… నందమూరి అభిమానులకు సందేశం పంపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close