దావోస్ పర్యటన చాలా ఉపయోగపడింది – చంద్రబాబు

హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక పరిస్థితిని, ప్రపంచంలో ఏమి జరుగుతోందని తెలుసుకోవటానికి దాపోస్ ఆర్థిక సదస్సు ఉపయోగపడిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్, సింగపూర్ పర్యటనలను ముగించుకుని తిరిగి వచ్చిన్ చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నైపుణ్యం, సామర్థ్యం పెంచుకోగలిగితే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు సాధించొచ్చని అన్నారు. ఇలాంటి సదస్సుల వల్ల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా అందించాలో తెలుసుకోవచ్చని చెప్పారు. స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్‌లో 11 కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలిపారు. ఏపీలో ఫార్మా, సోలార్, పవర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపారని చెప్పారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం బ్రాంచ్ ఏర్పాటుకు ఆహ్వానించానని తెలిపారు.

రాజధాని అమరావతి ప్రాంత రైతాంగంలో అపోహలు పెరిగాయని సీఎమ్ అన్నారు. కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లోని రహదారులపై మంత్రులు తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. రెండు మూడు రోజుల్లో రాజధాని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. గ్రీన్ బెల్ట్‌పై వస్తున్న అభ్యంతరాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని వేరేచోట పెడితే రైతుల భూముల ధరలు ఇంతలా పెరిగేవా అన్నారు. తమ దావోస్ పర్యటన ప్లెజర్ ట్రిప్ కాదని, ఐఏఎస్ అధికారి రావత్‌కు ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ అయిందని చంద్రబాబు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close