తెలంగాణ అసెంబ్లీతోపాటు ఏపీ లోక్‌సభ సీట్లకు ఉపఎన్నికలు ఎందుకు పెట్టరు..?

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి వారం రోజులు కాక ముందే.. ఎన్నికల సంఘం ఏర్పాట్లన్ని దాదాపుగా పూర్తి చేసింది. ఈవీఎంలను నియోజకవర్గాలకు పంపించేస్తున్నారు. అంత హడావుడిగా.. శరవేగంగా.., అందరూ ఆశ్చర్యపోయేలా ఈసీ పని చేస్తోంది. అంత వరుకు బాగానే ఉంది కానీ.. ఏపీలో ఐదుగురు వైసీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదు..?. ఒక్కసారి కూడా.. ఐదుగురు సభ్యుల రాజీనామాలు, వాటి స్థానాల్లో ఉపఎన్నికల విషయంలో ఎందుకు రివ్యూ చేయలేదు. ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. జూన్ ఇరవై ఒకటో తేదీన ఆమోదించారు. రెండున్నర నెలల తర్వాత స్పీకర్ ఎందుకు ఆమోదించారు…?

ఎవరైనా సభ్యులు రాజీనామాలు చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నికలు నిర్వహించి తీరాలి. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం ఇంత వరకూ.. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ఉపఎన్నికలపై ఎలాంటి కసరత్తు చేయలేదు. కానీ ఈసీ వర్గాలు మాత్రం ప్రజాప్రాతినిధ్యం చట్టం 171Aని కారణంగా చూపిస్తోంది. దీని ప్రకారం.. రాజీనామా చేసిన సభ్యుని పదవి కాలం ఏడాదిలోపు ఉంటే.. ఈసీ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నిక నిర్వహించకూడదని చెప్పలేదు. కానీ ఎవరో చెప్పినట్లుగా ఉపఎన్నికలు వద్దని.. ఈసీ నిర్ణయించేసుకున్నట్లుగా ఉంది. చట్టసభల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందంటే.. ఆయా స్థానాల ప్రజలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉండదు.

అందువల్ల ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగంలోని ప్రధానాంశం. దీన్ని రాజకీయ అవసరాల కోసం.. ఈసీ తనకు ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా.. కేంద్రానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో బందీగా మారిపోయిందని ఈ పరిణామలను బట్టి తెలుస్తోందన్న ఆరోపణలు జోరుగానే వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు నిర్వహించకుండా.. వైసీపీ బీజేపీతో చేసుకున్న ఒప్పందం.. తాజా వ్యవహారంతో బయటపడిపోయిందంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమైనా క్లారిటీ ఇస్తుందా..? లేదో చూడాలి..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close