చంద్రబాబు, లోకేష్‌లపై పిల్ ఉపసంహరించుకున్న మాజీ న్యాయాధికారి..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్ ను … పిటిషనర్ శ్రవణ్‌కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్ విచారణ అర్హతపై.. ధర్మాసనం … పిటిషనర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. కనీస ఆధారాలు లేకుండా.. పిటిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించింది. ధర్మాసనానికి ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. రాజకీయ అవసరాల కోసం వేసిన పిటిషన్‌లా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలు బయట చూసుకోవాలి కానీ… కోర్టు సమయాన్ని వృధా చేయడమేమిటని మండి పడింది. దీంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని.. శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్, ఏపిఎన్నార్టీకిచెందిన వేమూరి రవికుమార్ తప్పుడు ఎంవోయూలతో డొల్ల కంపెనీలను చూపించి 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని శ్రవణ్ కుమార్ పిల్‌లో ఆరోపించారు. శ్రవణ్ కుమార్ మాజీ జూనియర్ సివిల్ జడ్జి. ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు. జూనియర్ సివిల్ జడ్జిగా పని చేసిన వ్యక్తి… పిల్ వేయడంతో.. అందరి దృష్టి పడింది. అయితే.. న్యాయమూర్తిగా కూడా పని చేసిన వ్యక్తి.. రాజకీయ కక్షతోనే… ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తారని ఎవరూ అనుకోరు. దాంతో.. ఎవో కొన్ని ఆధారాలైనా సమర్పించి ఉంటారని అనుకున్నారు. కానీ శ్రవణ్ కుమార్ తన పిటిషన్‌లో.. సాక్షి సహా…ఇతర పత్రికల్లో వచ్చిన కథనాలు.. పవన్ కల్యాణ్, జగన్ లాంటి వాళ్లు చేసిన ఆరోపణలు.. ప్రభుత్వం వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలతోనే పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close