కన్నాను గెలిపించడానికి జగన్ ప్లాన్..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వైసీపీలోనే కాదు.. టీడీపీలో కూడా హాట్ టాపిక్ అయింది. ఏసురత్నం మాజీ పోలీసు అధికారిని సమన్వయకర్తగా నియమించడమే కాదు.. ఆయన అభ్యర్థి అని నేరుగా చెప్పేశారట. దీంతో అసలు ఎవరు ఈ ఏసురత్నం..? ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. నిజానికి ఏసురత్నానికి గెలవడానికి కాకుండా ఓడిపోవడానికే జగన్ అభ్యర్థిగా నిలుపుతున్నారు. టీడీపీని గెలిపిస్తారా.. ? అన్న సందేహం రావొచ్చు కానీ.. ఆయన గెలిపించాలనుకుంటున్నది బీజేపీ అభ్యర్థిని. కన్నా లక్ష్మినారాయణను. వైసీపీ అగ్రనేతల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ.

గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేశారు. ఇరవై వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలనుకుని.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కానీ “బీపీ” రావడంతో ఆగిపోయారు. “బీపీ” రావడానికి వైసీపీ, బీజేపీ మధ్య అంతర్గత రాజకీయాలు కారణమన్న ప్రచారం కూడా జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసినా.. వైసీపీ సాయంతో గెలిపిస్తామన్న హామీ.. ఢిల్లీ నుంచి వచ్చినందునే.. కన్నా బీజేపీలోనే ఉండిపోయారన్న విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. ఆయన గెలవాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు బలహీనమైన అభ్యర్ధిని రంగంలోకి దించాలని, లోపాయికారి ఒప్పందం ఉందని ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇందులో భాగంగానే బలంగా లేళ్ళ అప్పిరెడ్డిని తొలగించి .. రాజకీయం తెలియని ఏసురత్నాన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు.

కన్నాను గెలిపించడానికి జనసేన కూడా లోపాయికారీగా సాయం చేయబోతోందట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరపున కమ్మ లేదా కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్దిని రంగంలోకి దించితే.. జనసేన నుంచి కూడా అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్దిని బరిలోకి దించాలని నిర్ణయించారట. దీని వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్దికి పడే ఓట్లు చీలిపోతాయనే వ్యూహం దాగి ఉంది. ఇందుకోసం ముగ్గురి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని తెలుగుదేశం నేతలు అనుమానిస్తున్నారు. పరిస్తితి చూస్తూంటే.. ఇదేమీ తీసి పడేసే రాజకీయ వ్యూహం అనిపించడం లేదు. ఎందుకంటే.. కన్నా లక్ష్మినారాయణ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా .. ఇప్పటి వరకూ చంద్రబాబుపై తిట్ల దండకం వినిపించడమే కానీ… జగన ను కానీ.. పవన్ ను కానీ పల్లెత్తు మాట అనలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close