దేశ ప్రజలందరికీ అద్వానీ ఒక మంచి సలహా

బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ అవకాశం చిక్కినపుడల్లా ప్రధాని నరేంద్ర మోడికి చురకలు వేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన మోడీకి చిన్న చురక వేస్తూనే మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా వెనకేసుకు వచ్చేరు.

ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా డిల్లీలో తన నివాసంలో మువ్వన్నెల జెండా ఎగురవేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మనం బ్రిటిష్ వారితో అనేక ఏళ్లపాటు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాము. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో భావస్వేచ్చకు భంగం కలిగిపోతోందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ మా ప్రభుత్వం వలననే మన భావ స్వేచ్చకు భంగం కలుగుతున్నట్లయితే అప్పుడు తప్పకుండా అందరూ కలిసి గట్టిగా పోరాడుతారు. కానీ దేశంలో ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఏదో అనర్ధం జరిగిపోతోందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు,” అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా మళ్ళీ ఎన్నికయిన తరువాత ఆయనింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోన్నందున బహుశః కొంచెం ప్రసన్నం అయ్యేరేమో?

అద్వానీ దేశ ప్రజలందరికీ ఈ రోజు ఒక మంచి సందేశం ఇచ్చేరు. “సాధారణంగా ఆగస్ట్ 15, గణతంత్రదినం వంటి రోజులలో దేశ ప్రజలలో దేశభక్తి పొంగిపొరలుతుంటుంది. అది చాలా సహజమే. కానీ అటువంటి భావన నిత్యం వారి చేతలలో కనిపించాలి. ప్రస్తుతం విద్య మరియు క్రీడా రంగాలలో అది చాలా ప్రస్పుటంగా కనబడుతోంది. మిగిలిన అన్ని రంగాలలో కూడా జాతీయ భావన, దేశభక్తిని కలిగి ఉండాలి. దేశ ప్రజలు అందరూ ఎల్లప్పుడూ కూడా జాతీయ భావన కలిగి ఉండాలి,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేరుకే పాతిక కోట్లు.. అంతా ఎగ్గొట్టేవారే!

పాపం... టాలీవుడ్ లో ఓ హీరో ప‌రిస్థితి చూస్తే జాలేస్తోంది. ఎలాంటి అండ దండ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి, స్టార్ గా ఎదిగిన హీరో అత‌ను. పారితోషికం మెల్ల‌మెల్ల‌గా పెరుగుతూ, ఇప్పుడు పాతిక...

వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి...

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close