నాడు అన్న గెలిచిన చోట.. నేడు జ‌న‌సేనాని ఫోక‌స్‌..!

ఈనెల 15 నుంచి ప్ర‌జాపోరాట యాత్ర‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన నేత‌ల‌తో ప‌వ‌న్ దాదాపు రెండు గంట‌ల‌కుపైగా స‌మావేశమ‌య్యారు. ప‌ర్య‌ట‌న ప్రారంభం నాడు ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద కాట‌న్ బ్యారేజ్ మీద క‌వాతు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఈ క‌వాతు గురించి తెలుగు రాష్ట్రాల‌తోపాటు, దేశ‌వ్యాప్తంగా చ‌ర్చించుకునే విధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఇక‌, ఈ జిల్లాలోని మొత్తం 19 నియోజ‌క వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన పోటీ చేయాల‌న్న వ్యూహంలో ఉంది. వీటిలో మ‌రీ ముఖ్యంగా… గ‌తంలో ప్ర‌జారాజ్యం కైవ‌సం చేసుకున్న స్థానాల‌పై ప‌వ‌న్ ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నార‌ట‌.

పెద్దాపురం, పిఠాపురం, కొత్తపేట‌, కాకినాడ రూర‌ల్… ఈ నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో 2009లో చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం గెలిచింది. అంతేకాదు, కాకినాడ లోక్ స‌భ స్థానంలో కూడా అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం గ‌ట్టిగానే పోటీ ఇచ్చింది. నాటి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ప‌ల్లంరాజుకి కూడా అప్ప‌ట్లో ముచ్చెమ‌ట‌లే ప‌ట్టాయి. సామాజిక వ‌ర్గం ప‌రంగా అప్ప‌ట్లో చిరంజీవి పార్టీకి ఈ జిల్లా నుంచి మంచి మ‌ద్ద‌తే ల‌భించింది. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన త‌రువాతి నుంచి ఆ సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించే ప్ర‌త్యేక పార్టీ అంటూ లేకుండా పోయిందనేది వారి అభిప్రాయం! ఇప్పుడు, జ‌న‌సేన‌ను త‌మ సొంత పార్టీగా ఆ సామాజిక వ‌ర్గం చూస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో జ‌న‌సేన‌కు కాస్త సులువుగానే బ‌ల‌మైన పునాదులు ఏర్ప‌డ్డాయ‌నేది వారి అంచ‌నా! గ‌తంలో ప్ర‌జారాజ్యం ద‌క్కించుకున్న ఆ నాలుగు నియోజ‌క వ‌ర్గాలను క‌చ్చితంగా ఈసారి గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో జ‌న‌సేన ఉన్న‌ట్టు స‌మాచారం.

నిజానికి, ఓ మూడు నెల‌ల కింద‌టే ఈ నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో జ‌నసేనాని ప్రాథమికంగా ఒక స‌ర్వే చేయించార‌నీ, ఈ స్థానాల్లో టీడీపీ, వైకాపాల ప‌ట్టుపై కొంత అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌నీ స‌మాచారం! తాజా యాత్ర నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలోకి దింప‌బోతున్న అభ్య‌ర్థుల‌కు సంబంధించి కూడా ప‌వ‌న్ ఒక స్ప‌ష్ట‌త‌కు వస్తార‌ని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఆ నాలుగు స్థానాల‌తోపాటు జిల్లాలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల‌న్న‌దే ప‌వ‌న్ ప‌ట్టుద‌ల అంటున్నారు! అయితే, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన‌లో చేరిన‌వారిలో వైకాపా నుంచి వ‌చ్చిన‌వారే ఎక్కువ‌మంది ఉండ‌టం గ‌మ‌నార్హం. అభ్య‌ర్థుల ఎంపిక వ‌ర‌కూ వ‌చ్చేసరికి ఇంకా కొత్త చేరిక‌లు ఏవైనా ఉంటాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close