ఏపీని మోడీ మోసం చేస్తున్నా జగన్, పవన్ ఎందుకు మాట్లాడరు: చంద్రబాబు

ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై… ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పూర్తి స్థాయిలో స్పందించడానికి వెనుకాడుతూండటాన్ని చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. వారిద్దర్నీ బీజేపీతో ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ప్రత్యేకహోదా, విభజన హామీలు సహా.,. ఏ విషయంలోనూ వారు… కేంద్రంపై నోరెత్తిన సందర్భం లేదు. తాజాగా వెనుకబడిన జిల్లాలకు తెలంగాణకు నిధులు ఇచ్చి.. ఏపీకి ఇవ్వకపోవడాన్ని కూడా… వీరు ప్రశ్నించలేకపోయారు. దీంతో చంద్రబాబు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వారిని కార్నర్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నా.. ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నా .. ఏపీకి నిధులు ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తున్నానన్నారు. ఏపీపై కేంద్రం దాడి చేస్తోంది .. ఒకేసారి 19 ఐటీ బృందాలతో తనిఖీలు చేయించిందని మండిపడ్డారు. మీ బెదిరింపులకు దడుసుకునేది లేదు, ఎంతటి పోరాటానికైనా సిద్ధం కేంద్రానికి అల్టిమేటం జార చేశారు. టీడీపీ అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపనలో సీఎం దూకుడుగా విమర్శలలు చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం ధర్మ పోరాటం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక… బీజేపీపై పవన్‌, జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందంతో టీడీపీని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. ఏపీలో ఇంత దివాలాకోరు ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. నీరిస్తామంటే వద్దనే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు. గండికోటకు నీరొస్తే పుట్టగతులుండవని అడ్డుపడుతున్నారు… అయినా గండికోటకు 12.5టీఎంసీల నీరు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పులివెందులకు నీరిచ్చిన తర్వాతే… కుప్పంకు నీరు తీసుకెళ్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నానన్నారు. కరువు జిల్లా అనంతపురానికి కియా సంస్థ వచ్చింది.. శ్రీకృష్ణ దేవరాయలు ఎప్పుడో నిర్మించిన చెరువులకు… తాను నీళ్లు రప్పించానని సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తామని కొంత మంది నేతలు ప్రకటించారని… పట్టిసీమ పూర్తయిన తర్వాత తోక జాడించారన్నారు. ఏపీలో 47 ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తమదేనన్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close