ఎన్టీఆర్‌ నోట పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌…

‘కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని అత్తా… బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని!’ – ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌లో పవన్‌కల్యాణ్‌ చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌! ఆదివారం జరిగిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ ఇదే డైలాగ్‌ చెప్పారు. త్రివిక్రమ్‌ పరిస్థితి వివరించడానికి ఈ డైలాగ్‌ ఉపయోగించారు. అత్తారిల్లు చిత్రంలో కన్నీటిపర్యంతమవుతూ పవన్‌ చెప్పిన ఆ డైలాగ్‌.. ఓ మనిషిలో అంతర్గత సంఘర్షణకు అద్దం పట్టింది. తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు త్రివిక్రమ్‌ పరిస్థితి కూడా అదే విధంగా వుందని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ‘అరవింద సమేత…’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఈ కథ కంటే ముందు త్రివిక్రమ్‌గారు నాకు రెండు కథలు చెప్పారు. కానీ, ఆ కథలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో స్పార్క్‌ నాకు కనిపించలేదు. ఆయనలో ఏదో సందిగ్ధం వుంది. ఓ సినిమా కోసం ఆయనే డైలాగ్‌ రాశారు కదా… కనిపించని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేశారు. చివరకు ఈ కథ చెప్పారు. ఈ కథ చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో ఒక స్పార్క్‌ చూశా. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నేను ఎటువంటి సినిమా చేయాలనుకుంటున్నానో… అటువంటి కథ చెప్పారు. ఆయన దర్శకత్వంలో నేను కేవలం కామెడీ సినిమా మాత్రమే చేయాలనుకోలేదు. నవరసాల్లో కామెడీ అనేది ఒక రసం మాత్రమే. అది కాకుండా బలమైన బావోద్వేగాలను చెప్పగల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌’’ అని అన్నారు. రాబోయే రోజుల్లో తన పిల్లలకు గర్వంగా చూపించుకునే చిత్రం ‘అరవింద సమేత’ అని ఎన్టీఆర్‌ ఉద్వేగంతో చెప్పారు. తనకు త్రివిక్రమ్‌ ఆత్మబంధువు అని మరోసారి చెప్పిన ఆయన, తన తల్లికి మరో కుమారుడిగా, భార్యకు అన్నగా, పిల్లలకు మావయ్యగా త్రివిక్రమ్‌ని అభివర్ణించారు. చిత్రవిజయం త్రివిక్రమ్‌దే అని ఎన్టీఆర్‌ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close