బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార పిటిషన్లు..! అగ్రిగోల్డ్ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!

అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీపై అగ్రెసివ్ గా వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వరుసగా ధర్నాలు చేస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు స్వాహా చేస్తున్నారన్నట్లుగా ఆరోపణలు చేస్తూండటాన్ని ఏ మాత్రం.. సహించకూడదని.. నిర్ణయించింది. నేరుగా ఆరోపణలు చేసిన వారందరిపై కోర్టు ధిక్కార పిటిషన్లు వేయబోతున్నారు. ఇది పార్టీ పరంగా కాకుండా.. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐజీ ద్వారానే వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న .. బీజేపీ నేతలపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
హైకోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం జరుగుతుండగా .. ఆరోపణలు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలోనే పూర్తిస్థాయిలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేస్తున్నారని.. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా .. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్న సీఐడీతోనే కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయించనున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్రతి వ్యవహారం కోర్టు ద్వారానే నడుస్తోంది. గతంలో జీఎస్సెల్ సంస్థ టేకోవర్ కు ముందుకొచ్చినా.. అది కూడా కోర్టు పరిశీలన ద్వారా ప్రక్రియ జరిగింది. అయితే చివరికి జీఎస్సెస్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో.. ఇప్పుడు సీఐడీ ద్వారా వేలానికి రంగం సిద్ధమయింది. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
అయినప్పటికీ.. బీజేపీ నేతలు ఇప్పుడు దీన్నో రాజకీయ అంశంగా చేసుకుని.. ఆరోపణలు చేయడానికి సిద్ధమైపోవడంతో… ఎదురుదాడి చేయాలని టీడీపీ నిర్ణయించింది. నేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లే వేయబోతూండటం కాస్త సంచలనం కలిగించేదే. కోర్టు ఈ రాజకీయ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకంటే బీజేపీ నేతలకు చిక్కులు తప్పకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close