జ‌న‌సేన‌, వైకాపా పోటీ చేయ‌క‌పోవ‌డం లాలూచీ కాదా?

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే తాము కేంద్రంలోని భాజ‌పాతో పోరాటం సాగిస్తున్నామ‌నీ, అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తామ‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. నెల్లూరులోని ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ… భాజ‌పాతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీని దెబ్బ‌తియ్యాల‌ని భాజ‌పా చూస్తోంద‌నీ, అది ఎవ‌రి వ‌ల్లా కాద‌న్నారు. వైకాపా, జ‌న‌సేన‌లు లాలూచీ రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉంటే ఎందుకు ప‌వ‌న్ పోటీ చెయ్య‌లేద‌నీ, ఎందుకు జ‌గ‌న్ పోటీకి దిగ‌లేద‌నీ… ఇదంతా లాలూచీ రాజ‌కీయం కాదా అని ప్ర‌శ్నించారు.

ఈరోజున రాజ్యాంగ ప‌ర‌మైన ఒక‌ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైంది కాబ‌ట్టి, కాంగ్రెస్ తో తాము క‌లిశామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. దేశంలో మ‌నం ఒక్క‌రమే ఎదురెళ్లి ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోలేమ‌నీ, మన శ‌క్తికి తోడుగా దేశంలోని ఇత‌ర రాజ‌కీయ పార్టీలూ వెంట రావాల‌నీ, ఆ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ కూడా రావాల‌న్నారు. న‌ల‌భై సంవ‌త్స‌రాల భేదాభిప్రాయాల‌ను ప‌క్క‌న‌పెట్టి, తానే ఒక్క అడుగు ముందుకేసి దేశం కోసం, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం, మ‌న రాష్ట్ర హ‌క్కుల కోసం ముందుకొచ్చాను అన్నారు. జాతీయ స్థాయిలోని కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌న్నీ భాజ‌పా భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

రాష్ట్రం కోసం ఏం చేశారంటూ త‌మ‌ను వైకాపా నేత‌లు ప్ర‌శ్నించ‌డం హాస్యాస్పదం అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న‌ప్పుడు.. ధైర్య‌ముంటే త‌మ‌తో రావాల‌ని స‌వాలు విసిరామ‌నీ, కానీ ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ప్ర‌జ‌లు చూశార‌న్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తే… సంవ‌త్స‌రం కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న‌ట్టుగా చూసుకుని భాజ‌పా ఆమోదించింద‌న్నారు. వీళ్ల‌కి ఎన్నిక‌లంటే భ‌య‌మ‌నీ, మోడీ అంటే వీళ్ల‌కి భ‌య‌మనీ, ఎందుకంటే ఈ నాయ‌కుల మీద కేసులున్నాయ‌న్నారు. ఎదురిస్తే జైలుకి పోతామ‌న్న భ‌యంతో రాష్ట్ర హ‌క్కుల‌ను తాక‌ట్టుపెట్టిన పార్టీ వైకాపా అని విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నిజ నిర్ధార‌ణ క‌మిటీ అంటూ హ‌డావుడి చేశార‌నీ, ఆ త‌రువాత ఏమ‌య్యార‌ని ప్ర‌శ్నించారు? అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని సినిమా డైలాగ్ చెప్పి, అడ్ర‌స్ లేకుండా పోయార‌ని ముఖ్య‌మంత్రి విమ‌ర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close