పవన్ స్ట్రాటజీ: గౌతు, చింతమనేని, కన్నబాబు, జేసి

పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర ఈ రోజు రాయలసీమలో కి ప్రవేశించింది. అనంతపురంలో జనసేన కవాతు కి భారీ స్పందన వచ్చింది. ఎప్పటిలాగానే చంద్రబాబు ని, లోకేష్ ని, జగన్ ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అనంతపురం సభలో జే.సి ప్రభాకర్ రెడ్డి ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.

జెసి ప్రభాకర్ రెడ్డి ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, పాతకాలం ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది అన్న విషయాన్ని జేసీ అర్థం చేసుకోవాలని, ప్రస్తుత యువతరానికి ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే భయం లేదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో తనకు కాన్షీరామ్ స్ఫూర్తి అని చెప్పిన పవన్ కళ్యాణ్, కాన్షీరామ్ పార్టీ ప్రారంభించిన కొత్తలో ఉత్తరప్రదేశ్లో వీధికొక గుండా ఉండేవాడని, వీరంతా కాన్షీరామ్ ని అణగదొక్కడానికి ఎంత ప్రయత్నించినా, ఆయన వీటన్నింటికీ ఎదురొడ్డి నిలబడ్డారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల శైలి గమనించిన వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సందర్భంలో , ప్రజల్లో కాస్తంత నెగటివ్ ఇమేజ్ ఉన్న ఒక స్థానిక నాయకుని ఎన్నుకుంటాడు. వారి గురించి పూర్తి చిట్టా తన దగ్గర పెట్టుకొని ఉద్దేశ్యపూర్వకంగా వారిని బలంగా టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఒకవేళ వాళ్ళు దీనికి ప్రతిస్పందిస్తే మరింత బలంగా వారిని టార్గెట్ చేస్తాడు. వారి మీద ఉన్న నెగటివ్ ఇమేజ్ కారణంగా ఈ మాటల యుద్ధం పవన్ కళ్యాణ్ కి బాగా మైలేజ్ తీసుకొని వస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు గౌతు శిరీష ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, పశ్చిమగోదావరిలో చింతమనేని ప్రభాకర్ ఇదేవిధంగా బలం గా టార్గెట్ చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ని ఇలాగే టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో జెసి ప్రభాకర రెడ్డిని టార్గెట్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన టార్గెట్ లని ఎన్నుకున్నట్లు అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలుస్తున్నప్పటకీ , ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ కలిగిన నాయకులను పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యపూర్వకంగా ఎంచుకుంటున్నాడు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించకుండా ఒక్కొక్క చోట ఒక సామాజిక వర్గానికి చెందిన ఇలాంటి నాయకులను ఎంచుకుంటూ ఉంటున్నాడు.

అయితే ఈ స్ట్రాటజీలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఎన్నికలు వచ్చాక తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close