టిఆర్ఎస్ మేనిఫెస్టో లో ముఖ్యాంశాలు ఇవే

ఆదివారం నాడు సికింద్రాబాదులో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ టిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టోలో మరీ కొత్త అంశాలు , ఆశ్చర్యపరిచే అంశాలు పెద్దగా లేకపోయినప్పటికీ, ఇప్పటికి లో ఉన్న పథకాలన్నీ కొనసాగించేలా గా అలాగే వాటి పరిధి పెంచే లాగా ఈ మేనిఫెస్టో లోని హామీలు కనిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రధాన అంశాలు ఇవే:

రైతు బంధు పథకం ద్వారా ఇప్పటికే 8వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే దీన్ని ఇప్పుడు పది వేల రూపాయలకు పెంచారు. అలాగే అర్థమైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల నుంచి ఆరు లక్ష రూపాయల వరకు సహాయాన్ని అందించే హామీ పొందుపరిచారు. అలాగే పెన్షన్లను పెంచారు. ఆసరా పెన్షన్ లో వికలాంగుల పెన్షన్ లు అన్నింటికీ చెల్లించే మొత్తాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతోపాటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఆ మధ్య ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం లాగానే మిగతా ఆరోగ్య సమస్యల కి కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తో పాటు సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని , రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ తో పాటు ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు కొన్ని హామీలు – అన్ని పార్టీలు అన్ని ఎన్నికలలో ఇచ్చే హామీలు – మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం పోరాటం, అగ్రకులాల్లో ని పేదల కోసం ప్రత్యేక పథకాలు, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పాటు పడటం, ఇలాంటి ఇతర కొన్ని హామీలు మేనిఫెస్టోలో యధావిధిగా దర్శనం ఇచ్చాయి.

ఏది ఏమైనా టిఆర్ఎస్ మేనిఫెస్టో లో కొత్తగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు ఏవీ పొందుపరచక పోయినప్పటికీ దాదాపు అన్ని పథకాలను కొనసాగించడం , వాటి పరిధి పెంచడం చూస్తుంటే మొత్తం మీద సంక్షేమ పథకాల తోనే కెసిఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close