స్మార్ట్‌సిటీల జాబితాలో వైజాగ్, కాకినాడ: తెలంగాణకు దక్కని చోటు

హైదరాబాద్: ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీల పథకం మొదటి దశ అమలుకు శ్రీకారం జరిగింది. మొదటి దశలో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దే నగరాల తొలి జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం, కాకినాడ నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలో ఒక్క నగరంకూడా ఎంపిక కాలేదు. వరంగల్ నగరం కొద్ది తేడాతో, ఒక్క పాయింట్‌తో అవకాశం కోల్పోయిందని మంత్రి చెప్పారు. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి.

జాబితాలో భువనేశ్వర్, పూణె, జైపూర్, సూరత్, కొచ్చి, అహ్మదాబాద్, జబల్పూర్, విశాఖపట్నం, షోలాపూర్, దావణగెరే, ఇండోర్, న్యూఢిల్లీ ఏరియా, కోయంబత్తూర్, కాకినాడ, బెల్గాం, ఉదయ్‌పూర్, గౌహతి, చెన్నై, లూథియానా, భోపాల్ నగరాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలనుంచి ఒక్క నగరం కూడా ఎంపిక అవలేదు. ఈ జాబితా తయారీలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని మంత్రి చెప్పారు. 43 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రం రూపొందించి వివిధ నగరాల పాలనా యంత్రాంగాలను జవాబులు కోరామని, వాటి ఆధారంగా ఎంపిక జరిగిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన స్మార్ట్ సిటీలకు ఒక్కొక్కదానికి రు.200 కోట్లను మొదటి సంవత్సరం, తర్వాత ప్రతి సంవత్సరం రు.100 కోట్లను కేంద్రం మంజూరు చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close