హైకోర్టు విభజనతో మళ్లీ మొదటికి జగన్ కేసుల విచారణ..! కొత్త కోణం వెల్లడించిన చంద్రబాబు..!!

హైకోర్టు విభజన తో జగన్ కేసుల పై ప్రభావం పడుతుందా..?. సీబీఐ కోర్టుకు హైకోర్టుకు సంబంధం ఏముంది..? సీబీఐ కోర్టు.. సీబీఐ కోర్టే కదా.. అని అందరికీ అనిపించవచ్చు. కానీ హైకోర్టుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ కేంద్రం సంప్రదింపులు జరపలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదన్నారు. ఇలా ఎందుకు చేశారన్నదానిపై చంద్రబాబు భిన్నమైన విశ్లేషణ చేశారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల జగన్‌ కేసులకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని… ఆ దృష్టితో కూడా విభజన చేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని… ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. జగన్‌ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని గుర్తు చేశారు.

హైకోర్టు విభజన వ్యవహారం మొత్తం ఇప్పటి వరకూ ఒక వైపు అందరూ చూశారు. చంద్రబాబు మాత్రం… రెండో వైపు చూశారు. హైకోర్టు పరిధిలోని న్యాయాధికారులను కూడా బదిలీ చేశారు. ఈ క్రమంలో… నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని చంద్రబాబు చెబుతున్నారు. అంటే.. చంద్రబాబు చెప్పనట్లు… నిజంగానే జగన్ కేసులు మొదటి నుంచి మళ్లీ విచారణ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ కేసు విషయంలో ఇప్పటికే వివిధ కారణాల రీత్యా చాలా ఆలస్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈడీ దూకుడుగా వ్యవహరించి.. కొన్ని ఆస్తులు జప్తు చేసినప్పటికీ.. ఆ తర్వాత బీజేపీతో వైసీపీ సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత నెమ్మదించిందనే విమర్శలు టీడీపీ వైపు నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈడీ అటాచ్ చేసిన కొన్ని ఆస్తులను కేంద్రం ప్రత్యేక ఆదేశాల ద్వారా విడిపించిందని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో బయటపెట్టారు.

హైకోర్టు విభజన అనివార్యమే అయితే.. రాష్ట్రపతి నోటిఫికేషన్ తర్వాత కనీసం మూడు నెలల గడువు ఇవ్వడం ఆనవాయితీ. ఈ సారి అలాంటి ప్రస్తావనే లేదు. ఐదు రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రధానితో భేటీ అయిన అరగంటలోనే ఈ గెజిట్ విడుదల కావడంపై.. అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అయంది. ఈ తరుణంలో చంద్రబాబు.. జగన్ కేసుల కోణాన్ని బయటపెట్టడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close