‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ గురించి మాట్లాడ‌లేదేంటి..?

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్లో కీల‌క పాత్ర పోషించాడు క‌ల్యాణ్ రామ్‌. తండ్రి హ‌రికృష్ణ పాత్ర త‌న‌కే ద‌క్క‌డం, బాబాయ్‌తో క‌ల‌సి వెండి తెర పంచుకోవ‌డం…. క‌ల్యాణ్ రామ్‌ని ఉత్సాహ‌ప‌రుస్తున్న అంశాలు. అందుకే.. మీడియాని పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలలో షూటింగ్ అనుభ‌వాల‌నూ, బాబాయ్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని బాగానే పంచుకున్నాడు.కానీ ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం దాటేశాడు. అదే.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి పోటీగా వ‌ర్మ తీస్తున్న సినిమా ఇది. ‘ఎన్టీఆర్‌’లో దాచేసిన నిజాల్ని.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో చూపించి తీర‌తా.. అని గ‌ట్టిగా చెబుతున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమా అనేక వివాదాల‌కు కేంద్ర బిందువు కానుంది. ఈ సినిమాపై మాత్రం క‌ల్యాణ్ రామ్ స్పందించ‌డానికి నిరాక‌రించాడ‌ని టాక్‌. ‘మీకు పోటీగా వ‌ర్మ‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు క‌దా.. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే ప్ర‌శ్న‌కు క‌ల్యాణ్ రామ్ స‌మాధానం ఇవ్వ‌లేద‌ట‌. ‘అలాంటి సినిమాల గురించి మాట్లాడ‌కుండా ఉండ‌డ‌మే మంచిది’ అంటూ క్లుప్తంగా ముగించాడ‌ని తెలుస్తోంది. ఓ విధంగా అదీ మంచిదే. ఇప్పుడు నంద‌మూరి క‌థానాయ‌కులు ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా… వ‌ర్మ దాన్నీ ప్ర‌చారానికి వాడుకుంటాడు. ఆ అవ‌కాశం ఇవ్వకుండా జాగ్రత్త ప‌డ్డాడు క‌ల్యాణ్ రామ్. క‌నీసం బాల‌య్య అయినా ఈ విష‌య‌మై పెద‌వి విప్పుతాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close