చంద్రబాబు దావోస్ టూర్‌పై కేంద్రం ఆంక్షలు..! కొత్తగా ఎందుకో…?

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ తరపున వెళ్లే బృందంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పదిహేను మందితో వెళ్లాలనుకున్న చంద్రబాబుకు.. కేంద్రం షాక్ ఇచ్చింది. అంత మంది అవసరం లేదు.. ఐదుగురితో వెళ్లాలని… సూచించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు.. ప్రతి ఏడాది దావోస్‌లో జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఆ సదస్సుకు తరలి వస్తారు. అందుకే చంద్రబాబు ప్రతీ ఏడాది ఓ పదిహేను మంది బృందంతో… అక్కడికి వెళ్తారు. ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ స్టాల్ కూడా ఏర్పాటు చేసి.. వీలైతే.. బస్సులపై “సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్” అనే స్లోగన్‌తో పబ్లిసిటీ కూడా చేసుకుంటారు. వీలైనంత వరకూ.. అక్కడ ఏపీ లో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూంటారు. ఈ ఏడాది కూడా జనవరి ఇరవై నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగబోతోంది. దానికి ఎప్పట్లానే పదిహేను మందితో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ ఢిల్లీ నుంచి అడ్డుపుల్ల పడింది.

సాధారణం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అధికారిక పర్యటనకు వెళ్లాలంటే.. ముందుగా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపి పర్మిషన్ తీసుకోవాలి. అయితే అది లాంఛనమే. దౌత్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తప్ప… ఏ ముఖ్యమంత్రి అయినా విదేశీ పర్యటనకు వెళ్లదల్చుకుంటే… అడ్డు చెప్పడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. కానీ మొదటి సారిగా.. ఏపీ ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లేందుకు సిద్ధమైన డెలిగేషన్ పై ఆంక్షలు విధించారు. పదిహేను మంది అవసరం లేదు.. ఐదుగురు చాలు అంటూ.. ఏపీ ప్రభుత్వం పంపిన అనుమతి లేఖను తిప్పి పంపారు. ఎంత మంది వెళ్లాలో చెప్పడానికి కేంద్రం ఎవరు… అని… ఏపీ ప్రభుత్వం భగ్గుమంటోంది. కేంద్రానికి ఘాటుగా తిరిగి లేఖ రాయాలని నిర్ణయించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌పై కసితోనే… కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే విమర్శలు రావడానికి కేంద్రమే ఆస్కారం ఇస్తోంది. ఎందుకంటే.. నాలుగేళ్ల పాటు చంద్రబాబునాయుడు దావోస్‌కు… ఇంత కంటే పెద్ద బృందాలతోనే వెళ్లారు. అప్పుడు కేంద్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండానే పర్మిషన్ ఇచ్చింది. కానీ.. ఇప్పుడు బీజేపీతో కటిఫ్ చెప్పిన తర్వాత మాత్రం.. ఐదుగురు చాలంటూ… నిబంధనలు పెడుతోంది. అందుకే.. ప్రజల్లో బీజేపీపై సందేహాలు పెరుగుతున్నాయి. టీడీపీ నేతల ఆరోపణలకు కారణం అవుతోంది. మరి బీజేపీ ఈ విషయాన్ని ఎలా సమర్థించుకుంటుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close