బ్రేకింగ్ : జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు బదిలీ చేయమన్న హైకోర్టు

విశాఖ ఎయిర్ పోర్ట్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి పై విచారణను ఎన్ఐఏ కు అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబరు 25 వ తేదీ ఈ దాడి తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సాక్షాత్తు డిజిపి విచారణ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాడి చేసిన యువకుడు వై ఎస్ ఆర్ సి పి అభిమాని అని చెప్పడం, తన దగ్గర ఒక ఉత్తరం దొరికిందని చెప్పడం, ఆ ఉత్తరాన్ని అప్పుడు మీడియాకు విడుదల చేయకుండా చాలా సేపటి తర్వాత విడుదల చేయడం, అంతేకాకుండా తెలుగుదేశం నాయకులు జగన్ స్వయంగా తనపై తానే దాడి చేయించుకున్నాడని వ్యాఖ్యానించడం, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి తెలుగుదేశం నాయకులు ఒకడుగు ముందుకు వేసి జగన్ తల్లి విజయమ్మ ఈ దాడి చేయించిందని వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగితే తమకు న్యాయం జరగదని భావించిన వైఎస్సార్సీపీ నేతలు, ఎయిర్ పోర్టు లో జరిగిన ఈ దాడి ఘటన విచారణ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బదిలీ చేయాలని కోరారు.

ఇప్పుడు ఎన్ఐఏ చట్టం సెక్షన్ 6 ప్రకారం, ఎయిర్ పోర్టు లో జరిగే ఘటనలు రాష్ట్ర పోలీసుల పరిధిలోకి రావు కాబట్టి విచారణ కూడా ఇలాంటి సంస్థ ఆధ్వర్యంలోని జరగాలని కోరిన పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అలాగే కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని పిటిషనర్ చేసిన వాదనతో కూడా హైకోర్టు ఏకీభవించింది.

మొత్తానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close