వారసత్వమే తారకమంత్రం…వారసత్వంపై సన్నాయి నొక్కులే!

Telakapalli-Raviకుమారుడు కెటిఆర్‌ను తన వారసుడుగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందన్న కథనాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పందన చూస్తే అంగీకారముద్ర వేసినట్టే కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. “చేస్తే అవుతారా? ప్రోటోకోల్‌ పాటించకపోతే ఇతర మంత్రులు వూరుకుంటారా?” వంటి మాటలన్నీ సన్నాయి నొక్కులుగా వున్నాయి తప్ప స్పష్టమైన రాజకీయ స్వరం లేదు. ఆ చర్చ అప్రస్తుతం అనో ఆ ఆలోచన ఇప్పుడు లేదనో చెప్పడానికి సిద్దం కాలేదు. పోనీ “అవన్నీ మీ వూహాగానాలే వదంతులే…”అని ఖండించింది కూడా లేదు. ఓటుకు నోటు కేసు గురించి అడిగితే తర్వాత మాట్లాడతానని దాటేయడం కూడా దాన్ని ప్రస్తావించిన హరీష్‌కు కొంత ఇబ్బంది కలిగించే అంశం. అదే వంద స్థానాల సవాలుకు వచ్చేసరికి “కెటిఆర్‌ ఏడన్నాడు?” అని వెనకేసుకొచ్చారు. ఆ లెక్కతో ఏకీభవించడానికి కూడా సిద్ధం కాలేదు. మజ్లిస్‌ మతతత్వంపై ప్రశ్నలకు కూడా “ఎవరో అన్నది నేనెలా చెబుతానని..” దాటేశారు గాని వారు తమ పార్టీ ప్రముఖులే గాక కుటుంబ సభ్యులు కూడా గనక ఉభయత్రా తనకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వుందని భావించలేదు. చాలా రాజకీయ పాలనా పరమైన ప్రశ్నలకు నిర్దిష్టంగా ఖరాఖండిగా సమాధానాలు ఇచ్చిన కెసిఆర్‌ కుమారుడికి వారసత్వం గురించి మాత్రం లోతులు తడమకుండా వదలేసి పరోక్షంగా ఆశీర్వాదాలు అందించారన్న మాట. “అతనికే అధిక ప్రాధాన్యత నిస్తే ఇతర మంత్రులు వూరుకుంటారా? అన్న ఆయన ప్రశ్నకు ఇప్పటి వరకూ వున్నారు కదా..అని ఆచరణలో చూస్తున్న దృశ్యమే సమాధానం చెబుతుంది. ఒక దశలో కెటిఆర్‌ స్వయంగా దీనిపై క్షమాపణలు చెబుతున్నానని ఒక చర్చలో కెటిఆర్‌ అన్నారు కూడా. కెసిఆర్‌ నిరాహారదీక్ష వంటివి ఇంకా మొదలు కాని రోజుల్లోనే రవి ప్రకాశ్‌ జరిపిన మారథాన్‌ షోలోనే కుటుంబ నాయకత్వం గురించి అడిగితే “పని చేసేవారికి స్థానం కల్పించడం ఎలా పొరబాటవుతుందని…” ఎదురు ప్రశ్న వేశారు. సో..ఆయన అప్పుడూ ఇప్పుడూ క్లియరే! కాకపోతే అప్పుడు హరీశ్‌ రావుతో సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఒక్క కెటిఆర్‌ చుట్టూనే తిరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close