కోడికత్తి కేసులో ఎన్ఐఏ విచారణ …! ఇక విజయవాడలోనే..!

వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పై జరిగిన కోడికత్తి దాడి కేసు ఎట్టకేలకు ఎన్ఐఏ చేతికి వెళ్లింది. నిందితుడు శ్రీనివాస్ ను విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. ఎన్.ఐ.ఎ కోర్టులో శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో పాటు, నిందితడు శ్రీనివాస్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఏడవ మెట్రో సెషన్స్ కోర్టు విచారణ జరిగింది. అయితే ఈ కేసు ఎన్.ఐ.ఎ పరిధిలోకి వెళ్లడంతో ఈ కేసు విచారణ ఎన్.ఐ.ఎ ప్రత్యేక కోర్టు చేపట్టింది.

విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడ ఎన్.ఐ.ఎ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ ఏడవ మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్ ను అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్.ఐ.ఎ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు విజయవాడలోనే ఉండటంతో కేసుకు సంబంధించిన పూర్తి విచారణ ఇక్కడే కొనసాగనుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు విశాఖపట్నం జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించారు. నిందితుడు శ్రీనివాసరావును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్.ఐ.ఎ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. నిందుతుడి తరుపు న్యాయవాది లేకపోవడంతో కస్టడి పిటీషన్ కాపీని నిందితుడు శ్రీనివాసరావుకు అందజేశారు. కస్టడీ పిటీషన్ ను న్యాయమూర్తి పెండింగ్ లో ఉంచారు.

హైకోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయకపోయినా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎన్ఐఏకు కేసు అప్పగించింది. ఇది రాష్ట్ర పరిధిలో కేంద్రం చొరబడటమేనని… రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓ దశలో కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేసింది. కానీ… కేంద్రానికి నిరసన లేఖతో సరి పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో.. కేసు విచారణ … ఇక ఎన్ఐఏనే చేపట్టనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close