టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేల చేరికలు ఉత్త మైండ్ గేమేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కొత్తగా… టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు వెల్లువలా వచ్చి చేరబోతున్నారని కొద్ది రోజులుగా మీడియా ప్రచారం చేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో పన్నెండు మంది, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిదీ అదే దారి అని.. చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ దూకుడు చూస్తూంటే … అది నిజమేనేమో అన్న భావన కల్పించారు. నిజానికి అది మైండ్ గేమ్ అని.. ఇప్పుడిప్పుడే తేలిపోతోంది. టీఆర్ఎస్ అనుకూల మీడియా సాయంతో…. ఎవరెవర్ని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారో ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ… కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి.. ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహిరంచింది. పార్టీ ఫిరాయిస్తే.. ఎవరెవరికి.. ఎలాంటి ప్రయోజనాలను కేసీఆర్ కల్పిస్తారో ఆశ పెడుతూ కథనాలు ప్రచురించింది.

సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి.. ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే… వారిపై నుంచి ఖండనలు వచ్చాయి తప్ప.. ఆ మైండ్ గేమ్ ఫలించలేదు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే.. వారికి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయవచ్చన్న ప్లాన్ కేసీఆర్ అమలు చేయబోతున్నారని చెప్పుకుకున్నారు. ప్రతిపక్షం లేని తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ చూపించబోతున్నారని… టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేశాయి. అయితే.. కారణం ఏదైనా కానీ.. ఈ సారి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ గొప్పగా ఫలించలేదని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా… టీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా ముందడుగు పడిన పరిస్థితులు కనిపించడం లేదు. సండ్ర టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది.

కానీ.. 88 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరపున గెలిస్తే… వారిని కాదని వలస ఎమ్మెల్యేలకు ఇస్తే.. చెడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో.. టీఆర్ఎస్ మళ్లీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తానికి.. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే.. చేరికలు పూర్తి చేయాలనుకున్న కేసీఆర్ కు పరిస్థితులు కలసి రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close