రిపబ్లిక్ టీవీ సరే.. సీవోటర్, ఇండియా టుడే సర్వేలు ఏం చెప్పాయి..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్ణబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ.. నెలకోసారి బూస్ట్ ఇస్తూ ఉంటుంది. నేషనల్ అఫ్రూవల్ రేటింగ్స్ పేరుతో చానల్.. కొన్ని ఫలితాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆ చానల్ ప్రకటించే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. బీజేపీకి పది శాతం ఓట్లు .. కాంగ్రెస్ కు రెండు సీట్లు కూడా వేస్తూ ఉంటారు. వైసీపీకి… ఇరవై సీట్లకు దరి దాపుల్లోనే ఇస్తూ ఉంటారు. ఈ సారి అలాంటి సర్వే వచ్చింది. వైసీపీ బ్యానర్ గా ప్రచురించుకుంది. కానీ రిపబ్లిక్ నేషనల్ అప్రూవల్ రేటింగ్ప్ ప్రకటిస్తున్న సమయంలోనే ఇండియా టీవీ – కార్వీ, ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలు కూడా బయటకు వచ్చాయి. ఈ రెండు సర్వేల్లో… భిన్నమైన ఫలితాలొచ్చాయి. కానీ ఈ సర్వేలను తక్కువ చూపించి వైసీపీ సంబరపడిపోతోంది. నిజానికి ఈ సర్వేల్లో.. వైసీపీకి ఐదు లోపే సీట్లు వస్తాయని పరోక్షంగా చెప్పారు.

కాంగ్రెస్ కు చాలా దూరంగా… బీజేపీకి కొంచెం దూరంగా ఉంటున్న బిజూ జనతాదళ్, వైసీపీ, టీఆర్ఎస్ అన్నాడీఎంకే కలుసినా… ఎన్డీఏకు ఒకటి, రెండు సీట్లు తక్కువే పడతాయని.. ఇండియా టీవీ – కార్వీ, ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేలు దాదాపుగా ఒకే రకమైన ఫలితాన్ని ప్రకటించారు. . అదే బీజేపీకి ఆమడ దూరంలో ఉంటూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తోనే కలుస్తామని చెబుతున్న తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ లాంటి పార్టీలు గెలుచుకునే సీట్లతో.. యూపీఏ అధికారంలోకి రావొచ్చని చెప్పాయి. ఈ సర్వేల్లో దక్షిణాది కీలకం. ఎన్డీఏకు 14 సీట్లు, బీజేపీకి దగ్గరగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీలకు 37 సీట్లు సట్లు వస్తాయని అంచనా వేశారు. అంటే ఇందులో టీఆర్ఎస్ కు 15 సీట్లు ఖాయం అనుకుందాం.. బీజేడీకి ప్రధానంగా పోటీ ఇచ్చే స్థాయిలో ఒడిషాలో బీజేపీ ఎదగలేదు. కాబట్టి అక్కడ ఉన్న 21 లోక్ సభ సీట్లలో కనీసం 15 అయినా బీజేడీ సులువుగా సాధిస్తుంది. ఇక అన్నాడీఎంకే, వైసీపీ కలిసి ఏడు స్థానాలు సాధిస్తాయనుకుందా. ఎలా చూసినా.. వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదని ఈ సర్వేలు చెప్పేశాయి.

కానీ వైసీపీ కోసం కొన్ని జాతీయ మీడియాలు మాత్రం.. పదే పదే … అత్యధిక లోక్ సభ సీట్లు ఇస్తూ.. ఫలితాలు విడుదల చేస్తూ ఉంటాయి. వాటిని సాక్షి పత్రిక.. టీవీ ప్రధానంగా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి సర్వేల వల్ల ప్రజాభిప్రాయం మారుతుందో లేదో కానీ.. సాక్షి మాత్రమే.. వీటికి ప్రాధాన్యం ఇవ్వడం.. ఎప్పుడూ ఒకే రకంగా ఫలితాలు ప్రకటిస్తూ ఉండటంతో ప్రజల్లోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close