చైతన్య : దీక్ష మోడీ చేస్తే ఒప్పు.. చంద్రబాబు చేస్తే తప్పు..! అంతేగా.. అంతేగా..!

కన్నా జీ.. మన సభకు డబ్బులెవరు ఖర్చు పెట్టారు..?.. మోడీ ప్రశ్న..
పార్టీనే పెట్టుకుంది సార్..! … కన్నా ఆన్సర్..
కార్యకర్తల డబ్బుతోనే బీజేపీ సభ పెట్టుకుందని కన్నా చెబుతున్నారు..!.. జీవీఎల్ తర్జుమా.

గుంటూరులో జరిగిన నరేంద్రమోడీ సభలో… ఖర్చు గురించి చెబుతూ… నరేంద్రమోడీ, కన్నా, జీవీఎల్ వేసిన ఓ స్కిట్‌లో భాగంగా ఇదంతా జరిగింది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు … ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఆ దీక్షల కోసం ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజాధనం వాడుతున్నారని… ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందు కోసం.. ఈ స్కిట్ ప్లాన్ చేశారు. మోడీ హావభావాల విషయంలో.. మైనస్ మార్కులు పడే అవకాశం లేదు కాబట్టి.. బాగానే పేలిపోయింది. తోలుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టేశారు. కానీ… అసలు ఈ స్కిట్‌లో నిజాయితీ ఉందా..? అంటే.. మోడీ మార్క్ .. నిజాయితీ ఉందనుకోవాలి. ఎందుకంటే.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు.. ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ,ఐటీ దాడులను ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో ఇప్పుడంతా సమర్థిస్తున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు .. కారణం లేకపోయినా దీక్షల పేరుతో కోట్లు ఖర్చు చేసేవారు. ఇప్పుడు.. ఏపీ కోసం దీక్ష చేస్తున్నా.. దాన్ని ప్రజాధనం వృధాగా చెబుతున్నారు.

సీఎంగా ఉన్నప్పుడు రూ. 20 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో మోడీ దీక్షలు..!

గుజరాత్ ముఖ్యమంత్రిగా 2011-12లో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. మూడు రోజుల పాటు గుజరాత్ వ్యాప్తంగా సద్భావనా దీక్షలు నిర్వహించారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. గుజరాత్‌లో శాంతిని, సామరస్యాన్ని, ఐక్యతను కోరుతూ ఈ దీక్షలు చేశారు. అహ్మదాబాద్‌లో ఆయన దీక్షకు కూర్చోగా… ఆయన పరివారం మొత్తం వివిధ జిల్లాల్లో దీక్షలు చేసింది. ఈ మొత్తం ఖర్చులు .. ప్రభుత్వం పెట్టుకుంది. అప్పట్లోనే రూ. 20 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. పైగా ఈ మొత్తం… అత్యవసర నిధి నుంచి ఖర్చు చేశారు. ఈ ఖర్చుల వివరాలు మొదట్లో.. మోడీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. తర్వాత.. సమాచారహక్కు చట్టం కింద ధరఖాస్తు చేస్తే మొత్తం బయటకు వచ్చింది.

ప్రధాని అభ్యర్థిత్వం కోసమే ప్రజల సొమ్ముతో మోడీ దీక్షలు..!

ఇప్పుడు చంద్రబాబునాయుడు.. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై.. పోరాటం అనే ఓ కారణం చెబుతున్నారు. ఇది అచ్చంగా ఏపీ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఇలా పోరాటం చేయడం వల్ల చంద్రబాబుకు, టీడీపీకి.. ఏమైనా రాజకీయ ప్రయోజనాలు కలిగుతాయా.. లేదా అన్నది వేరే విషయం . కానీ మోడీ.. తొమ్మిదేళ్ల కిందట.. రూ. 20కోట్లతో చేసిన దీక్షలు దేని కోసం..?. భారతీయ జనతా పార్టీలో సాగుతున్న ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో విజయం సాధించడం కోసం. అప్పటికి బీజేపీ పుంజుకోలేకపోతోంది. అద్వానీ.. గొప్పగా పోరాటం చేయలేకపోతున్నారు. వాజ్‌పేయి… అనారోగ్యంతో మంచాన పడిపోయారు. ఇలాంటి సమయంలో.. హిందూత్వ వాదులకు ఓ బ్రాండ్‌గా ఉన్న మోడీ.. తాను రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి.. ప్రజల సొమ్ముతో దీక్షలు చేశారు. బీజేపీకి చెందిన అగ్ర నేతలుల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు అందర్నీ గుజరాత్ రప్పించుకుని … మద్దతుగా నిలిచేలా చేసుకుని.. ప్రధాని అభ్యర్థిత్వ కోసం రేసులో బలంగా నిలబడ్డారు.

చంద్రబాబు దీక్ష చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారు..?

నరేంద్రమోడీ… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఓ రకంగా ప్రధానిగా ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దెయ్యంలా కనిపించింది. అందుకే.. కేంద్రంపై విరుచుకుపడేవారు. అప్పట్లో కాంగ్రెస్ పదేళ్ల పాటు ఉంది కాబట్టి.. ఆయన సీబీఐ దగ్గర్నుంచి ప్రతీ విషయాన్ని రాజకీయం చేసేవారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా దారుణంగా ఆయన పాలన ఢిల్లీ నుంచి సాగుతోంది. ఇప్పుడు.. ఆయనకు అనిపించిన దానికంటే ముఖ్యమంత్రులకు అనిపిస్తోంది. కానీ.. మోడీ .. తాను ఒకప్పుడు చేసిన పనులను మర్చిపోయి… ఇప్పుడు … అన్యాయమైనపోయిన వారిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు తాను చేసిన దీక్షలను.. ఇప్పుడు వేరే వారు చేస్తే సహించలేకపోతున్నారు. అందుకే… అనైతికంగా రాజకీయ దాడులకు సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close