జనసేన నేత అరెస్టు, స్పీకర్ నియోజకవర్గం లో ఉద్రిక్తత

స్పీకర్ కోడెల శివప్రసాద్ నియోజకవర్గంలో, స్పీకర్ కుటుంబ సభ్యుల అవినీతిని వ్యతిరేకిస్తూ చేసిన దీక్ష అరెస్టులకు, ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన నేతలతో పాటు, విపక్ష నేతలు కూడా అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే..

జనసేన నేత బై రా దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్పీకర్ మరియు తన కుటుంబం నియోజకవర్గంలో చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా అంటూ దీక్ష మొదలు పెట్టారు. జన సేన పార్టీ ఆఫీసు నుండి తాలూకా ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. జనసేన తో పాటు విపక్షాల నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటు కమ్యూనిస్టుల తో పాటు ఇటు వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు. అయితే జనసేన నేతలు మొదలుపెట్టిన ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే విపరీతంగా జనాలు రావడంతో, పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, దీక్షకు అనుమతి లేదని చెప్పి , దిలీప్ చక్రవర్తితో పాటు ఇతర నాయకులను కూడా అరెస్టు చేశారు.

బైరా దిలీప్ చక్రవర్తి, మాజీ బ్యూరోక్రాట్. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే రాజకీయాల్లో ప్రవేశించి ఇదే సత్తెనపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఇటీవలే రీజినల్ కమిటీ కో ఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష పోలీసులు భగ్నం చేసినప్పటికీ, ఈ ర్యాలీకి నియోజకవర్గం లో వచ్చిన స్పందన విపక్ష నాయకులు అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close